AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PV Sindhu: ఫస్ట్ టైం చైనా ప్లేయర్ చేతిలో ఓటమి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ నుంచి పీవీ సింధు అవుట్

PV Sindhu: న్యూఢిల్లీలో జరుగుతున్న 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధుకు షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 16లో చైనా షట్లర్ వాంగ్ జీ యీ చేతిలో 21-11, 15-21, 21-17తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. చైనా ప్లేయర్‌పై ఇదే ఆమె తొలి ఓటమి.

PV Sindhu: ఫస్ట్ టైం చైనా ప్లేయర్ చేతిలో ఓటమి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ నుంచి పీవీ సింధు అవుట్
Pv Sindhu
Rakesh
|

Updated on: Aug 21, 2026 | 9:31 AM

Share

PV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు 2026 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఊహించని షాక్ తగిలింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన విమెన్స్ సింగిల్స్ రౌండ్-ఆఫ్-16 పోరులో చైనాకు చెందిన వాంగ్ జీ యీ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ విమెన్స్ సింగిల్స్ విభాగంలో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. హోరాహోరీగా సాగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా క్రీడాకారిణి వాంగ్ జీ యీ చేతిలో 21-11, 15-21, 21-17 తేడాతో పరాజయం పాలైంది. విశ్వ వేదికపై చైనా ఆటగాడి చేతిలో సింధు ఓడిపోవడం ఇది తొలిసారి కావడం గమనార్హం. గతంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో చైనా ప్లేయర్లతో తలపడిన ఎనిమిది సందర్భాల్లోనూ సింధు ఘన విజయం సాధించింది. ఆ అజేయ రికార్డును చెరిపివేస్తూ వాంగ్ జీ యీ ఈ వేదికపై సింధును ఓడించిన మొదటి చైనా ప్లేయర్‌గా నిలిచింది.

మూడు సెట్ల తీవ్ర పోరాటం

మ్యాచ్ ఆరంభం నుంచే చైనా షట్లర్ వాంగ్ జీ యీ తీవ్ర ఒత్తిడి పెంచింది. తొలి సెట్‌ను 21-11 తేడాతో ఏకపక్షంగా కైవసం చేసుకుని మ్యాచ్‌లో ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండో సెట్‌లో పుంజుకున్న పీవీ సింధు తనదైన శైలిలో కోర్టు నలుమూలలా షాట్లు ఆడుతూ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టింది. పుంజుకున్న ఆటతీరుతో రెండో సెట్‌ను 21-15తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది.

ఇది కూడా చదవండి: Test Record: సచిన్ 200 మ్యాచ్‌ల ప్రపంచ రికార్డ్ అవుట్.. 167వ టెస్టులోనే సంచలనం సృష్టించిన ఇంగ్లాండ్ బ్యాటర్

చేజారిన మూడో సెట్ ఆధిక్యం

విజేతను నిర్ణయించే మూడో సెట్‌లో పీవీ సింధు అద్భుతమైన ఆరంభాన్ని సాధించింది. ఒకానొక దశలో 3-0తో ముందంజలో ఉన్న సింధు, ఆ తర్వాత తన చాకచక్యంతో 8-4 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సింధు విజయం ఖాయమని అందరూ భావించారు. మ్యాచ్ విరామ సమయానికి కూడా భారత ప్లేయర్ 11-10తో స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఆ తర్వాత అనవసర తప్పిదాలు చేయడం, వాంగ్ జీ యీ అద్భుతంగా పుంజుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. చివరి క్షణాల్లో వరుసగా పాయింట్లు రాబట్టిన చైనా ఆటగాడు మూడో సెట్‌ను 21-17తో గెలుచుకుని క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు

క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ ప్లేయర్‌తో వాంగ్ జీ యీ పోరు

ఈ సంచలన విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన చైనా క్రీడాకారిణి వాంగ్ జీ యీ, తదుపరి మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్‌సేన్‌తో తలపడనుంది. లైన్ క్రిస్టోఫర్‌సేన్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన పి కే వర్దానీని 21-18, 21-17 తేడాతో ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us