ఆ విషయంలో ధోనీ నన్ను టీజ్ చేస్తాడు : ఇషాంత్
ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలో తన ఏజ్ కు సంబంధించి.. శ్రీమతి ప్రతిమతో పాటు, మాజీ కెప్టెన్ ధోనీ ఎలా ఆటపట్టిస్తాడో వివరించాడు.
Ishant Sharma about dhoni : ఇండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ సెప్టెంబరు 2 నాటికి 32 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నాడు. ఈ క్రమంలో తన ఏజ్ కు సంబంధించి.. శ్రీమతి ప్రతిమతో పాటు, మాజీ కెప్టెన్ ధోనీ ఎలా ఆటపట్టిస్తారో వివరించాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపాడు.
“నిజానికి మెంటల్ గా 32ఏళ్ల కంటే ఎక్కువగా పెరిగా. నా శ్రీమతి ఎప్పుడూ నన్ను ఓల్డ్ అంటూ పిలుస్తుంది. ఇక మాహీ అన్న అయితే, ఎలా ఉన్నావ్ పెద్దాయన? అని ఆటపట్టిస్తాడు. నీ ఏజ్ 32 ఏళ్లు మాత్రమే.. కానీ 52 ఏళ్లలా ఎదిగావు.. అంటూ సరదాగా టీజ్ చేస్తాడు” అని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు.
2007లో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్.. ధోనీతో మంచి స్నేహంగా మెలిగాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ అనుభవాన్ని బట్టి చూస్తే.. ఇషాంత్కు ధోనీ మూడేళ్లు సీనియర్. టీమ్ఇండియా తరఫున ఎక్కువ కాలం కలిసి ఆడిన వీరిద్దరి మధ్య స్నేహ బంధం కూడా బలంగా ఉంది. ఇక టెస్టు క్రికెట్లో మరో మూడు వికెట్లు తీస్తే.. 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్గా క్రేజీ రికార్డు అందుకోనున్నాడు ఇషాంత్.
Read More : వారికి రూ.15వేలు సాయం : జగన్ సర్కార్ సంచలన జీవో రిలీజ్