WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ లో షారుఖ్‌ స్పెషల్ పర్ఫామెన్స్ .. ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

ఐపీఎల్‌ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని కూడా కలర్‌ ఫుల్‌ గా మార్చాలనుకుంటోంది బీసీసీఐ. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. WPL 2024 రెండవ ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు అభిమానులను అలరించనున్నారు.

WPL 2024: మహిళల ప్రీమియర్ లీగ్‌ లో షారుఖ్‌ స్పెషల్ పర్ఫామెన్స్ .. ఫ్రీగా లైవ్ స్ట్రీమింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Shah Rukh Khan

Updated on: Feb 22, 2024 | 12:55 PM

ఐపీఎల్‌ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని కూడా కలర్‌ ఫుల్‌ గా మార్చాలనుకుంటోంది బీసీసీఐ. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
WPL 2024 రెండవ ఎడిషన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. సెలబ్రేషన్స్ లో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు అభిమానులను అలరించనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ ప్రదర్శన ఇస్తారని వార్తలు వస్తున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఫిబ్రవరి 23న చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. దీనికి ముందు బీసీసీఐ ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో కింగ్ ఖాన్ స్పెషల్‌ పర్ఫామెన్స్ ఇవ్వనున్నాడు. ఆయనతో పాటు వరుణ్ ధావన్, షాహిద్ కపూర్, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా WPL ప్రారంభ వేడుకల్లో సందడి చేయనున్నారు.

షారూఖ్ ఖాన్‌కు క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. రెండుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, అలాగే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలకు యజమానిగా వ్యవహరిస్తోన్నాడు షారుక్‌. అయితే సాధారణంగా కేకేఆర్ మ్యాచ్ లు జరిగినప్పుడు మాత్రమే గ్యాలరీలో కనిపిస్తాడు బాలీవుడ్ బాద్‌ షా. అయితే ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్‌ లో స్పెషల్‌ ఫర్పామెన్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యాడీ స్టార్ హీరో. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 17 వరకు జరగనుంది. గతేడాది మాదిరిగానే మొత్తం ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. . 24 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఒక్క డబుల్ హెడర్ మ్యాచ్ కూడా ఉండదు. ప్రతి రోజు ఒక మ్యాచ్ మాత్రమే ఆడతారు. ఎలిమినేటర్ మ్యాచ్ మార్చి 15న, ఫైనల్ మార్చి 17న ఢిల్లీలో జరగనుంది.

ఇవి కూడా చదవండి

 

షాహిద్ కపూర్..

 

సిద్ధార్థ్ మల్హోత్రా..

కార్తీక్ ఆర్యన్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..