AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హుషారుగా రూ. 70 వేల ఉంగరంతో రీల్ చేయబోయింది.. కాసేపటికే.!

స్టేడియంలో గ్యాలరీలో కూర్చుని సోషల్ మీడియా కోసం రీల్ తీస్తున్న క్రమంలో, తన చేతికి ఉన్న సుమారు రూ. 70 వేల విలువైన ఉంగరం ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయింది. రద్దీగా ఉన్న స్టేడియంలో ఆ ఉంగరం తిరిగి దొరకకపోవడంతో సదరు యువతి కన్నీటి పర్యంతమైంది.

Viral Video: హుషారుగా రూ. 70 వేల ఉంగరంతో రీల్ చేయబోయింది.. కాసేపటికే.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Apr 15, 2026 | 11:52 AM

Share

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ కోసం జనం ఎంతటి సాహసాలకైనా వెనుకాడటం లేదు. తాజాగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా ఒక యువతి చేసిన ప్రయత్నం ఆమెకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కేవలం ఒక వీడియో కోసం ఆమె తన ఖరీదైన బంగారు ఉంగరాన్ని పోగొట్టుకుంది. ఐపీఎల్ మ్యాచ్ అంటేనే సందడి, కేరింతలు. మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో అలరిస్తుంటే, గ్యాలరీలో అభిమానులు తమదైన రీతిలో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక యువతి మ్యాచ్ చూస్తూ సోషల్ మీడియా కోసం రీల్ తీయాలని నిర్ణయించుకుంది. తన చేతికి ఉన్న ఖరీదైన ఉంగరాన్ని చూపిస్తూ వీడియో తీస్తున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఆ ఉంగరం ఆమె వేలి నుంచి జారి స్టేడియం గ్యాలరీ కింద పడిపోయింది.

పోగొట్టుకున్న ఉంగరం విలువ దాదాపు రూ. 70 వేలు ఉంటుందని సమాచారం. ఉంగరం జారి కింద పడగానే ఆ యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎంత వెతికినా స్టేడియంలోని రద్దీలో అది దొరకలేదు. ఆ క్షణంలో ఆమె పడిన ఆవేదన అంతా కెమెరాలో రికార్డు అయింది. కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం చేసిన ఈ ప్రయత్నం ఇంతటి నష్టాన్ని మిగిల్చడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. “అవసరమా ఈ రీల్స్ పిచ్చి?” అని కొందరు మండిపడుతుంటే, “పాపం చాలా ఖరీదైన వస్తువు పోయింది” అని మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే “ఇది కేవలం ప్రచారం కోసం చేసిన డ్రామా కావచ్చు” అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఏది ఏమైనా బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా రద్దీగా ఉండే స్టేడియాల్లో విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ముఖ్యంగా యువత రీల్స్ చేసే క్రమంలో పరిసరాలను మర్చిపోతున్నారు. ఎత్తైన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ప్రాణాపాయంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఈ ఘటన ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే.. సోషల్ మీడియా క్రేజ్ కంటే ప్రాణాలు, విలువైన వస్తువులే ముఖ్యమని గుర్తించాలి.

ఇది చదవండి: హైదరాబాద్‌లో ఫ్లాట్ లేదా విల్లా కొనేటప్పుడు ఈ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..

Follow Us