AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Captain: ఆ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు.. సల్మాన్ బట్ ఏం సమాధానం చెప్పాడు..

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్ పేర్లు ఎక్కువ మంది చెబుతారు. ఈ ముగ్గురూ అద్భుతమైన ఆటగాళ్లుగానే కాదు కెప్టెన్లుగా రాణించారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు మంచి కెప్టెన్ అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది...

Best Captain: ఆ ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు.. సల్మాన్ బట్ ఏం సమాధానం చెప్పాడు..
Butt
Srinivas Chekkilla
|

Updated on: Nov 24, 2021 | 10:01 AM

Share

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్ పేర్లు ఎక్కువ మంది చెబుతారు. ఈ ముగ్గురూ అద్భుతమైన ఆటగాళ్లుగానే కాదు కెప్టెన్లుగా రాణించారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు మంచి కెప్టెన్ అనే చర్చ తరచుగా జరుగుతుంటుంది. టెస్టుల్లో ఇంగ్లండ్‌కు రూట్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. కేన్ విలియమ్సన్ మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అదే సమయంలో టీ20లో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ ఇప్పుడు వన్డేలు, టెస్టుల్లో మాత్రమే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పాల్గొనడం లేదు. ముంబై వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అనే దానిపై తన అభిప్రాయాన్ని తెలిపారు.

కోహ్లీ, రూట్, విలియమ్సన్‌లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని ఓ అభిమాని తన యూట్యూబ్ ఛానెల్‌లో సల్మాన్‌ను అడిగాడు. కివీ జట్టు కెప్టెన్ విలియమ్సన్‌ బెస్ట్ కెప్టెన్ అని సల్మాన్ సమాధానం ఇచ్చాడు. “కేన్ విలియమ్సన్ అత్యుత్తమ కెప్టెన్ అని నేను భావిస్తున్నాను. రూట్, కోహ్లి కూడా తెలివైనవారే, వారు తమ జట్టును అద్భుతంగా నడిపించారు. అయితే మొత్తం మీద మీరు మూడు ఫార్మాట్‌లను పరిశీలిస్తే, విలియమ్సన్ అత్యుత్తమ కెప్టెన్‌గా కనిపిస్తారు.” సల్మాన్ బట్ అన్నాడు.

ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టును ఓడించింది. న్యూజిలాండ్‌కు ఇది రెండో ఐసీసీ టైటిల్. విలియమ్సన్ కెప్టెన్సీలో, న్యూజిలాండ్ ఈ నెల ICC T20 ప్రపంచ కప్-2021 యొక్క ఫైనల్ ఆడింది. వారు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. విలియమ్సన్ కెప్టెన్సీలో కివీ జట్టు 2019 ODI ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఓడిపోయింది. అదే సమయంలో కోహ్లి సారథ్యంలో భారత్ ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా కైవసం చేసుకోలేదు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 65 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, అందులో 38 గెలిచి 16 ఓడింది. కోహ్లీ కెప్టెన్సీలో 2018లో అతని స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది.

Read Also.. Bodybuilder: మిస్టర్ వరల్డ్ మణికందన్‏‎పై లైంగిక ఆరోపణలు.. అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు ఏం జరిగింది..