AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheteshwar Pujara: సెంచరీలు కాదు గెలవడం ముఖ్యం.. జట్టు కోసం పోరాడతాను..

భారత బ్యాటర్ చెటేశ్వర్ పుజారా గత కొద్ది రోజులుగా సెంచరీ చేయడం కోసం ఇబ్బంది పడుతున్నాడు. అతడు జనవరి, 2019లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై 193 పరుగులు చేసిన తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. అతను సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల అవుతుంది....

Cheteshwar Pujara: సెంచరీలు కాదు గెలవడం ముఖ్యం.. జట్టు కోసం పోరాడతాను..
Pujara
Srinivas Chekkilla
|

Updated on: Nov 24, 2021 | 10:21 AM

Share

భారత బ్యాటర్ చెటేశ్వర్ పుజారా గత కొద్ది రోజులుగా సెంచరీ చేయడం కోసం ఇబ్బంది పడుతున్నాడు. అతడు జనవరి, 2019లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై 193 పరుగులు చేసిన తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. అతను సెంచరీ చేసి దాదాపు మూడేళ్ల అవుతుంది. ఇది పుజారాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. కాన్పూర్‌లో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో భారత్ ఆడనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‎లో రాణించాలని పుజారా కృతనిశ్చయంతో ఉన్నాడు.

మంగళవారం నాటి ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన సెంచరీ కరువుపై అడిగిన ప్రశ్నకు పుజారా సమాధానమిస్తూ, “నా సెంచరీకి సంబంధించినంతవరకు, అది ఎప్పుడు జరగాలి, అది జరుగుతుంది. జట్టు కోసం బాగా బ్యాటింగ్ చేయడం నా పని. నేను పరుగులు చేయడం లేదు. నాకు 80లు, 90లు వచ్చాయి. నేను బాగా బ్యాటింగ్ చేస్తూ జట్టుకు సహకరిస్తున్నంత కాలం నా శతకం గురించి నేను బాధపడను.” అని పుజారా అన్నాడు.

కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్టుకు పుజారా వైస్ కెప్టెన్‎గా, రహానే కెప్టెన్‎గా వ్యవహించనున్నారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అజింక్యా రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. నేను వైస్-కెప్టెన్ కానప్పుడు కూడా నేను చేయగలిగినంత వరకు ప్రయత్నిస్తాను. నా అనుభవాలను పంచుకుంటాను. అంతిమ దృష్టి భారత జట్టుపైనే ఉంటుంది” అని పుజారా అన్నాడు. అంతకుముందు, టీ20 ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. కాన్పూర్ టెస్టులో విరామం కొనసాగించనున్న కోహ్లి.. డిసెంబర్ 3న ముంబైలో ప్రారంభమయ్యే రెండో టెస్టులో టీమిండియాతో చేరనున్నాడు.

Read Also.. IPL 2022: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2022 ప్రారంభం ఎప్పుడంటే.?