AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన రోజున వైభవ్ సూర్యవంశీ డబుల్ సెలబ్రేషన్.. తన బేబీ బ్రదర్‎ను చూశారా ?

ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఎంత బిజీగా ఉన్నా సరే, సోషల్ మీడియాలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు. వైభవ్ సూర్యవంశీ తన టీమ్ మేట్‌ని ముద్దుగా బేబీ బ్రదర్ అని పిలుస్తూ శుభాకాంక్షలు చెప్పాడు.

Vaibhav Suryavanshi : ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన రోజున వైభవ్ సూర్యవంశీ డబుల్ సెలబ్రేషన్.. తన బేబీ బ్రదర్‎ను చూశారా ?
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Nov 03, 2025 | 3:18 PM

Share

Vaibhav Suryavanshi : ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఎంత బిజీగా ఉన్నా సరే, సోషల్ మీడియాలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు. వైభవ్ సూర్యవంశీ తన టీమ్ మేట్‌ని ముద్దుగా బేబీ బ్రదర్ అని పిలుస్తూ శుభాకాంక్షలు చెప్పాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వైభవ్ కన్నా ఐదేళ్లు పెద్దవాడైన ఆ బేబీ బ్రదర్ ఎవరో కాదు, కిషన్ సింగ్. అంతేకాకుండా, భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన రోజునే కిషన్ సింగ్ పుట్టినరోజు కూడా రావడంతో వైభవ్ డబుల్ ధమాకా శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్న బీహార్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (14 ఏళ్లు), తన కంటే ఐదేళ్లు పెద్దవాడైన అండర్-19 టీమ్ మేట్ కిషన్ సింగ్‌ను ముద్దుగా బేబీ బ్రదర్ అని పిలుస్తున్నాడు. కిషన్ సింగ్ వయస్సు 19 ఏళ్లు. వైభవ్ లాగే కిషన్ కూడా బీహార్ నుంచే వచ్చి, ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కిషన్ సింగ్ తన 19వ పుట్టినరోజును నవంబర్ 2న జరుపుకున్నాడు. అదే రోజున వైభవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హ్యాపీ బర్త్‌డే బేబీ బ్రదర్ అని రాస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. నవంబర్ 2వ తేదీన కిషన్ సింగ్ పుట్టినరోజుతో పాటు, భారత క్రికెట్‌కు సంబంధించిన ఒక పెద్ద విజయం కూడా వచ్చింది. నవంబర్ 2న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సౌతాఫ్రికాను ఓడించి మహిళా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.

ఈ విజయాన్ని కూడా వైభవ్ సూర్యవంశీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆయన టీమిండియా గెలుపు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “వరల్డ్ ఛాంపియన్” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఆ విధంగా ఆయన ఒకే రోజున తన టీమ్ మేట్‌కు, భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ రంజీ ట్రోఫీలో బీహార్ జట్టుకు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే, జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఆయన బ్యాట్ నుంచి పరుగులు ఇంకా రావాల్సి ఉంది. మంచి ప్రదర్శన కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..