AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens World Cup 2025 : 4 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. టీమిండియా విక్టరీ సాంగ్ విన్నారా.. ఎంత బాగుందో

భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, టీమిండియా తొలిసారిగా మహిళా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, భారత జట్టు గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ విక్టరీ సాంగ్‎ను విడుదల చేసింది.

Womens World Cup 2025 : 4 ఏళ్ల నిరీక్షణ ఫలించింది.. టీమిండియా విక్టరీ సాంగ్ విన్నారా.. ఎంత బాగుందో
Womens World Cup 2025
Rakesh
|

Updated on: Nov 03, 2025 | 3:45 PM

Share

Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి, టీమిండియా తొలిసారిగా మహిళా వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుతమైన విజయం తర్వాత, భారత జట్టు గత నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ విక్టరీ సాంగ్‎ను విడుదల చేసింది. విన్నింగ్ సాంగ్‌ను గెలిచిన తర్వాతే విడుదల చేయాలని టీమ్ సభ్యులు గతంలోనే నిర్ణయించుకున్నారని జెమిమా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈ పాట లిరిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ 2025 టైటిల్‌ను గెలుచుకున్న సందర్భంగా, జట్టు గతంలో సిద్ధం చేసుకున్న తమ విక్టరీ సాంగ్‎ను విడుదల చేసింది. ఈ పాటను గెలిచిన తర్వాతే విడుదల చేయాలని జట్టు సభ్యులు భావించారు. జట్టులోని కీలక సభ్యురాలు జెమిమా రోడ్రిగ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. టీమ్ తమ మొదటి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన తర్వాత మాత్రమే పాటను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఈ పాట కోసం భారత జట్టు సుమారు నాలుగు సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. టైటిల్ గెలిచిన వెంటనే బీసీసీఐ ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రపంచకప్ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లంతా కలిసి ఈ పాటను ఒకే స్వరంతో ఆలపించారు. ఈ పాట లిరిక్స్ చాలా ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సౌతాఫ్రికా పై విజయం సాధించింది. టాస్ ఓడిపోయినప్పటికీ, భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. స్మృతి మంధానా (45), షెఫాలీ వర్మ (87) శుభారంభం ఇవ్వగా, మిడిల్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) విలువైన పరుగులు జోడించారు. దీంతో భారత్ 298 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ లౌరా వుల్వార్ట్ (101) అద్భుత సెంచరీ చేసినా, ఆమెకు మరో బ్యాటర్ నుంచి సరైన సహకారం లభించలేదు. భారత విజయంలో బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ 5 వికెట్లు, షెఫాలీ వర్మ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..