AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anmolpreet Singh: ఐపీఎల్ వేలంలో ఎవరు దేకలేదు.. కట్ చేస్తే ఒక్క దెబ్బతో ముగ్గురి రికార్డులు లేపేసాడు..

అన్మోల్‌ప్రీత్ సింగ్ అరుణాచల్‌పై 35 బంతుల్లోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయిన అన్మోల్ తన ప్రతిభను నిరూపిస్తూ, పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూసుఫ్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టిన ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.

Anmolpreet Singh: ఐపీఎల్ వేలంలో ఎవరు దేకలేదు.. కట్ చేస్తే ఒక్క దెబ్బతో ముగ్గురి రికార్డులు లేపేసాడు..
Anmolpreet Singh
Narsimha
|

Updated on: Dec 21, 2024 | 9:09 PM

Share

ఇటీవల ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన అన్మోల్‌ప్రీత్ సింగ్, విజయ్ హజారే ట్రోఫీలో తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 35 బంతుల్లోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.

పంజాబ్ తరఫున 115 పరుగులు చేసిన అన్మోల్‌ప్రీత్, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ 40 బంతుల్లో చేసిన రికార్డును బద్దలు కొట్టాడు. ఇది మాత్రమే కాకుండా, అతని ఇన్నింగ్స్ ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. ఈ ఘనత 29 బంతుల్లో శతకం బాదిన జేక్-ఫ్రేజర్ మెక్‌గర్క్, 31 బంతుల్లో సెంచరీ చేసిన ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు సమీపంగా నిలిచింది.

అన్మోల్‌ప్రీత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇద్దరు కలిసి 153 పరుగుల భాగస్వామ్యంతో పంజాబ్‌ను విజయానికి చేర్చారు. మరోవైపు, బౌలర్లు అశ్వనీ కుమార్, మయాంక్ మార్కండే తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి అరుణాచల్‌ను 164 పరుగులకే ఆలౌట్ చేశారు.

అయితే, ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోయినా అన్మోల్‌ప్రీత్ తన ప్రతిభను అద్భుతంగా రుజువు చేసుకున్నాడు. ఇది క్రికెట్ ప్రపంచానికి అతని సమర్థతను తెలియజేసే నిఖార్సైన ఇన్నింగ్స్.