AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: భారత్ ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందా.. ఆకాష్ చోప్రా ఏం చెప్పాడు..

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో 4వ రోజు టీమ్ ఇండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి ఉండాలా వద్దా అనే దానిపై భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‎మెన్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టు తమ ఇన్నింగ్స్‌ను కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉండాల్సిందని చోప్రా అభిప్రాయపడ్డాడు....

IND vs NZ: భారత్ ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందా.. ఆకాష్ చోప్రా ఏం చెప్పాడు..
India
Srinivas Chekkilla
|

Updated on: Nov 29, 2021 | 10:14 AM

Share

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో 4వ రోజు టీమ్ ఇండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసి ఉండాలా వద్దా అనే దానిపై భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‎మెన్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టు తమ ఇన్నింగ్స్‌ను కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉండాల్సిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. శ్రేయాస్ అయ్యర్ (65), వృద్ధిమాన్ సాహా (61*) హాఫ్ సెంచరీలతో భారత్‎ను ఆదుకున్నారు. భారత్ 234/7 వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. డిక్లరేషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆట ముగిసే సమయానికి, న్యూజిలాండ్ ఒక వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది, రవిచంద్రన్ అశ్విన్ ఓపెనర్ విల్ యంగ్‌ను అవుట్ చేశాడు. అతను డీఆర్ఎస్ తీసుకోవాడనికి సమయం తీసుకోవడంతో DRS టైమర్ అయిపోయింది. సమీక్ష కోసం ఆలస్యంగా అభ్యర్థించడంతో అతడి అభ్యర్థనను తిరస్కరించారు. ” సాధారణంగా ఈ నిర్ణయాలు ఫలితాలను బట్టి నిర్ణయిస్తారు. మీరు (2021) లార్డ్స్ టెస్టును పరిశీలిస్తే, చివరి రోజున ఇంగ్లాండ్‌కు భారత్ కేవలం 60 ఓవర్లు మాత్రమే ఇచ్చింది. అయినప్పటికీ, వారు 55 ఓవర్లలో (51.5) వాటిని బౌలింగ్ చేయగలిగారు. ఆలస్య ప్రకటన మంచిదా కాదా అనేది మనం వేచి చూడాలి,” అని చోప్రా స్టార్ స్పోర్ట్స్‌తో అన్నాడు. నాలుగో రోజు భారత బౌలర్లకు బౌలింగ్ చేయడానికి అవకాశమిస్తే మరిన్ని వికెట్లు తీసేవారని చోప్రా చెప్పాడు. భారత ఆటగాళ్లకు ఎలా గెలవాలో తెలుసునని అన్నాడు.

Read Also.. Sivaramakrishnan: జీవితాంతం వర్ణ వివక్షకు గురయ్యాను.. మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్..