IND Vs PAK: అప్పుడు హార్దిక్.. ఇప్పుడు చాహల్.. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియాదే..
టైటిల్ చూసి షాక్ అవ్వకండి..! కొంచెం స్టోరీ చదివేయండి.. మీకు ఇదేంటో అర్ధమవుతుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్.. వీరిద్దరూ తమ భార్యల నుంచి విడాకులు తీసుకుని భరణం కింద సగం ఆస్తి రాసిచ్చారు. ఆ తర్వాత ఏంటంటే..

ఏంటి.! టైటిల్ చూసి కొంచెం షాక్ అయ్యారా.. రెండు రోజులే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయింది. అప్పుడే టీమిండియాదే ట్రోఫీ అని జోస్యం చెబుతున్నామని అనుకుంటున్నారా.. ఈ స్టోరీ కాస్త చదివేయండి. ఛాంపియన్స్ ట్రోఫీని విజయంతో ప్రారంభించింది టీమిండియా. మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ సెంచరీతో అదరగొడితే.. మిడిలార్డర్లో రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉండగా.. భారత్ తన నాకౌట్ మ్యాచ్లలో ఇంకా న్యూజిలాండ్, పాకిస్తాన్తో తలబడనుంది.
ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్రేలో
మరోవైపు టీ20 ప్రపంచకప్ ముందు హార్దిక్ పాండ్యాకు తన భార్యతో విడాకులైంది. తన సంపాదనలోని 70 శాతం భరణం కింద ఇచ్చాడు. ఇక ఆ తర్వాత భారత్ తరపున టీ20 ప్రపంచకప్ ఆడి.. ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు చాహల్ తన భార్యతో విడాకులు తీసుకుని.. 60 కోట్లు భరణంగా ఇచ్చాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మన టీమిండియాదేనని ఫ్యాన్స్ అంటున్నారు. అటు హార్దిక్ టీమిండియాతో ప్రపంచకప్ ప్రాబబుల్స్లో ఉండగా.. ఇటు చాహల్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ టీంలో లేడు. ఇదొక్కటే డిఫరెన్స్. అయితే ఈ పోస్టుపై క్రికెట్ ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు అదేంటో మీరూ చూసేయండి.
View this post on Instagram
ఇది చదవండి: భారత్లో ‘టెస్లా’ కార్లు ట్రెండింగ్.. ఎంట్రీ లెవెల్ మోడల్ ధర తెలిస్తే మైండ్ బ్లాంకే
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








