ICC T20 Rankings: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో విధ్వంసంతో టీమిండియా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ భారీ బహుమతి అందుకున్నాడు. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో పొట్టి క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి కొత్త రాజుగా మారాడు. అంతకుముందు అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ జట్టు ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ను వెనక్కు నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. T20 WC లో సూర్య కుమార్ యాదవ్ 3 గేమ్లలో రెండు అర్ధశతకాలు సాధించాడు.
బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించిన అడ్వాంటేజ్తో 863 పాయింట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాపై ఈ అర్ధ సెంచరీ సాధించాడు.
పాకిస్థాన్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇద్దరి మధ్య 21 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. అంటే సూర్య రిజ్వాన్ పైన 21 పాయింట్లతో ముందున్నాడు. న్యూజిలాండ్కు చెందిన డెవాన్ కాన్వే 792 పాయింట్లతో మూడో స్థానంలో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 780 పాయింట్లతో నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్క్రామ్ 767 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.
??? ???? ?
Suryakumar Yadav is the new No.1 Men’s T20I batter ?
More ? https://t.co/DBmrAmzBYB#T20WorldCup | @MRFWorldwide pic.twitter.com/MUAgXYJFfY
— ICC (@ICC) November 2, 2022
ఐసీసీ ర్యాంకింగ్స్లో 638 పాయింట్లతో విరాట్ కోహ్లీ 10వ స్థానంలో కూడా ఉన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్లో విరాట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఫిఫ్టీలతో సహా 220 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్పై 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో ఈ టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
Say hello to the ICC Men’s No. 1⃣ T20I Batter! ? ?
Congratulations, @surya_14kumar. ? ?#TeamIndia pic.twitter.com/vKLbeaQCft
— BCCI (@BCCI) November 2, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..