Team India: టీమిండియా తర్వాతి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఆడనుందంటే? పూర్తి షెడ్యూల్ ఇదే..

Team India's Schedule: చాలా కాలం తర్వాత భారత జట్టు టెస్టు సిరీస్‌కు సిద్ధం కానుంది. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. త్వరలో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు పక్కా ప్లాన్‌ వేసింది. దీనికి ముందుగా బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

Team India: టీమిండియా తర్వాతి మ్యాచ్ ఎప్పుడు, ఎవరితో ఆడనుందంటే? పూర్తి షెడ్యూల్ ఇదే..
Ind Vs Ban Test Series
Follow us

|

Updated on: Aug 10, 2024 | 2:23 PM

India vs Bangladesh Test Series: భారత్-శ్రీలంక మధ్య సిరీస్ ముగిసింది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకోగా, వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. ముఖ్యంగా 27 ఏళ్ల తర్వాత లంకలో సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.

ఇప్పుడు ఈ సిరీస్ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందుకంటే, భారత్ తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో జరగనుంది. అంటే, వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ ద్వారా భారత ఆటగాళ్లు మళ్లీ బరిలోకి దిగనున్నారు.

సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో 2 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. విశేషమేమిటంటే ఈ టెస్టు మ్యాచ్‌లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో భాగమే. కాబట్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లు చాలా కీలకం. కాబట్టి, స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా నుంచి అద్భుతమైన ప్రదర్శనను ఆశించవచ్చు.

భారత్ vs బంగ్లాదేశ్ సిరీస్ షెడ్యూల్:

జట్లు తేదీ సమయం స్థానం
1వ టెస్టు, భారత్ vs బంగ్లాదేశ్ గురువారం, 19 సెప్టెంబర్ 2024 ఉదయం 9:30 గంటలకు చెన్నై
2వ టెస్టు, భారత్ vs బంగ్లాదేశ్ శుక్రవారం, 27 సెప్టెంబర్ 2024 ఉదయం 9:30 గంటలకు కాన్పూర్
1వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ ఆదివారం, 6 అక్టోబర్ 2024 రాత్రి 7 గంటలకు ధర్మశాల
2వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ బుధవారం, 9 అక్టోబర్ 2024 రాత్రి 7 గంటలకు ఢిల్లీ
3వ టీ20, భారత్ vs బంగ్లాదేశ్ శనివారం, 12 అక్టోబర్ 2024 రాత్రి 7 గంటలకు హైదరాబాద్

టెస్ట్ జట్టు కెప్టెన్ ఎవరు?

భారత టీ20 జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేశాడు. వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అయితే, టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ప్రశ్నకు సమాధానం రోహిత్ శర్మ. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు టెస్ట్ జట్టు కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ కొనసాగుతాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే తెలిపారు. దీంతో టీమిండియా టెస్టు జట్టు నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..