Rishabh Pant: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రీఎంట్రీ తర్వాత ఆ బాధ్యతల నుంచి పంత్ ఔట్? టెన్షన్‌లో బీసీసీఐ, ఢిల్లీ టీం..

Rishabh Pant Team India: పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. పంత్ పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడుతోంది. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్‌పై ఓ వార్త అభిమానులతోపాటు బీసీసీఐని కూడా టెన్షలో పడేస్తోంది. పంత్ కోలుకున్న తర్వాత వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అనే ప్రశ్నగా మారింది.

Rishabh Pant: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రీఎంట్రీ తర్వాత ఆ బాధ్యతల నుంచి పంత్ ఔట్? టెన్షన్‌లో బీసీసీఐ, ఢిల్లీ టీం..
Rishabh Pant

Updated on: Jul 02, 2023 | 11:59 AM

Rishabh Pant Team India: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. పంత్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. పంత్ పరిస్థితి చాలా వేగంగా మెరుగుపడుతోంది. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్‌పై ఓ వార్త అభిమానులతోపాటు బీసీసీఐని కూడా టెన్షలో పడేస్తోంది. పంత్ కోలుకున్న తర్వాత వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అనే ప్రశ్నగా మారింది. కారు ప్రమాదం తర్వాత పంత్‌కు అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. మరి ఇప్పుడు పంత్‌ వికెట్‌కీపింగ్‌లో వర్క్‌ లోడ్‌ చేస్తాడా లేదా అనేది చూడాలి.

‘ఇన్‌సైడ్‌స్పోర్ట్’తో బీసీసీఐ అధికారి పంత్ గురించి వెల్లడించారు. పంత్ నేరుగా వికెట్ కీపింగ్ ప్రారంభిస్తాడని చెప్పడం చాలా కష్టమని ఆయన అన్నారు. బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, “రిషబ్ పురోగతి అద్భుతంగా ఉంది. కానీ ఈ దశలో, అతను వెంటనే వికెట్ కీపింగ్ ప్రారంభిస్తాడో లేదో చెప్పడం చాలా కష్టం’ అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రాక్టీస్‌కు తిరిగి వచ్చిన తర్వాత పంత్ వికెట్ కీపింగ్ ప్రారంభించడానికి 3 నుంచి 6 నెలల సమయం పట్టవచ్చని కూడా చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ, “ప్రాక్టీస్‌కు తిరిగి వచ్చిన తర్వాత, 3 నెలలు పట్టవచ్చు లేదా 6 నెలల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. మేం ఖచ్చితంగా చెప్పలేం. రిషబ్ ఇంకా యువకుడే, క్రికెట్ ఆడేందుకు అతనికి చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ క్యాపిటల్స్‌లో మొదలైన ఆందోళన..

పంత్ తిరిగి రావడానికి సంబంధించి అధికారికంగా ఏమీ క్లియర్ కాలేదు. అయితే 2024 నాటికి ఆయన పునరాగమనం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, తదుపరి అంటే IPL 2024లో, ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ వికెట్ కీపింగ్‌ను కోల్పోవచ్చు. IPL 2023లో, పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ ఢిల్లీకి నాయకత్వం వహించాడు. కానీ, జట్టు పంత్ వంటి పటిష్టమైన వికెట్ కీపర్‌ను పొందలేకపోతుంది.

అభిషేక్ పూరల్‌ని ఢిల్లీ టీం ప్రయత్నించింది. దీంతో పాటు సర్ఫరాజ్ ఖాన్‌కు కూడా అవకాశం కల్పించారు. అయితే వికెట్ కీపర్‌గా సర్ఫరాజ్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే ఏడాది కూడా పూరల్ ఢిల్లీకి వికెట్ కీపర్‌గా పంత్‌ను భర్తీ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..