AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: గాయంతో 6 నెలలుగా దూరం.. రంజీతో రీఎంట్రీ ఇచ్చిన బ్యాడ్ లక్ ప్లేయర్.. ఈసారైనా చోటు దక్కేనా?

Prithvi Shaw: గతేడాది ఇంగ్లండ్‌లో కౌంటీ మ్యాచ్ ఆడుతూ పృథ్వీ షా గాయపడ్డాడు. ఈ గాయం తర్వాత యువ తుఫాన్ బ్యాటర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్న పృథ్వీ షా మళ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే పనిలో ఉన్నాడు.

Team India: గాయంతో 6 నెలలుగా దూరం.. రంజీతో రీఎంట్రీ ఇచ్చిన బ్యాడ్ లక్ ప్లేయర్.. ఈసారైనా చోటు దక్కేనా?
Prithvi Shaw
Venkata Chari
|

Updated on: Feb 01, 2024 | 2:26 PM

Share

Ranji Trophy 2024: టీం ఇండియా నుంచి దూరంగా ఉన్న యువ తుఫాన్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(Prithvi Shaw) తిరిగి రాబోతున్నాడు. మోకాలి గాయం కారణంగా గత 6 నెలలుగా మైదానానికి దూరంగా ఉన్న పృథ్వీ.. ఇప్పుడు రంజీ క్రికెట్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. శుక్రవారం నుంచి కోల్‌కతాలో బెంగాల్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబై జట్టులో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ 2023లో నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడుతున్న పృథ్వీ షా, డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా మధ్యలోనే మైదానాన్ని వీడాడు. దీని తర్వాత అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న పృథ్వీ షా రంజీ జట్టుకు ఎంపికయ్యాడు.

ప్రస్తుతం ముంబై జట్టుకు అజింక్యా రహానే నాయకత్వం వహిస్తుండగా, షమ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు 16 మంది సభ్యులతో కూడిన జట్టులోకి పృథ్వీ రావడంతో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పు వచ్చే అవకాశం ఉంది.

ముంబై ఓపెనర్ భూపెన్ లాల్వానీ ఈసారి రంజీ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటి వరకు 314 పరుగులు చేసిన లాల్వానీ జట్టు నుంచి తప్పుకునే అవకాశం లేదు.

అయితే, బెంగాల్‌పై పృథ్వీ షాను బరిలోకి దింపితే మరో ఓపెనర్ జై బిస్తా జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. దీని ప్రకారం ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న మ్యాచ్ ద్వారా పృథ్వీ షా మళ్లీ దేశవాళీ బరిలోకి దిగుతాడో లేదో వేచి చూడాలి.

ముంబై రంజీ జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), పృథ్వీ షా, జే బిస్తా, భూపేన్ లాల్వానీ, శివమ్ దూబే, అమోఘ్ భత్కల్, సువేద్ పార్కర్, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యాంశ్ షెడ్గే, తనుష్ కొట్యాన్, అథర్వ అంకోలేకర్ , ఆదిత్య ధుమాల్, మోహిత్ అవస్థి, ధవల్ కులకర్ణి, రాయ్‌స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా.

పృథ్వీ షా కెరీర్..

టీమిండియా తరపున 5 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో 339 పరుగులు చేశాడు. అతను 6 వన్డేల్లో మొత్తం 189 పరుగులు చేశాడు. అతను 1 T20 మ్యాచ్‌లో కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..