AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: అమెరికా ఫ్లైట్ ఎక్కేది ఆ రోజే.. టీమిండియా కీపర్‌గా పంత్ ఫిక్స్.. తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు?

Team India Squad for T20 World Cup 2024: ప్రపంచకప్ జట్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఏ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అనేక స్థానాలపై గందరగోళంలో నెలకొంది. సెలెక్టర్లు రెండవ వికెట్ కీపర్ ఎంపికపై తర్జన భర్జనలు పడాల్సి వస్తోంది.

Team India: అమెరికా ఫ్లైట్ ఎక్కేది ఆ రోజే.. టీమిండియా కీపర్‌గా పంత్ ఫిక్స్.. తలనొప్పిలా మారిన ఆ ఇద్దరు?
Team India T20i Wc Sqaud2
Venkata Chari
|

Updated on: Apr 29, 2024 | 2:10 PM

Share

Team India Squad for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ప్రపంచకప్‌నకు భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌నకు సంబంధించి టీమిండియా నుంచి ఓ కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. T20 ప్రపంచ కప్ జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ దేశాల్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి జట్టు ఎప్పుడు బయలుదేరుతుందనే విషయం బయటకు వచ్చింది.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, IPL మధ్యలోనే ప్రపంచ కప్‌నకు టీమ్ ఇండియా బయలుదేరవచ్చని తెలుస్తోంది. మూలం ప్రకారం, ఆ సమయానికి IPL నుంచి నిష్క్రమించే ఆటగాళ్లతో జట్టు మొదటి బ్యాచ్‌లో ప్రపంచ కప్‌నకు బయలుదేరవచ్చు. నివేదిక ప్రకారం, మే 21న టీమ్ ఇండియా ప్రపంచకప్‌నకు వెళ్లవచ్చని తెలుస్తోంది.

ఆ ఆటగాళ్లతో చిక్కుల్లో పడ్డ సెలక్టర్లు..

ప్రపంచకప్ జట్టు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఏ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో అనేక స్థానాలపై గందరగోళంలో నెలకొంది. సెలెక్టర్లు రెండవ వికెట్ కీపర్ ఎంపికపై తర్జన భర్జనలు పడాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

సెలెక్టర్లకు తలనొప్పిగా మారిన వికెట్ కీపర్..

సెలెక్టర్లు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ మధ్య రెండవ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ విషయంలో సెలెక్టర్లు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అయితే, రిషబ్ పంత్ IPLలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. అతను ఈ స్థానానికి మొదటి ఎంపికగా మారాడు. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఐర్లాండ్ తర్వాత జూన్ 9న గ్రూప్-ఎలో పాకిస్థాన్‌తో తలపడనుంది. భారత జట్టు తన తొలి మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లో మాత్రమే ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..