AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే బంతికి 17 పరుగులు.. టీమిండియాలో ఈ డేంజరస్ బ్యాటర్ గురించి మీకు తెలుసా?

Unique Cricket Records: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే బంతికి 17 పరుగులు వస్తాయని ఎవరూ ఊహించరు. కానీ, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఓ ప్లేయర్ టీమిండియాలోనే ఉన్నాడని మీకు తెలుసా? రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి దిగ్గజాలు కూడా సాధించలేని ఈ రికార్డు మరో టీమిండియా క్రికెటర్ సాధించడం విశేషం.

ఒకే బంతికి 17 పరుగులు.. టీమిండియాలో ఈ డేంజరస్ బ్యాటర్ గురించి మీకు తెలుసా?
Unique Cricket Records
Venkata Chari
|

Updated on: Apr 11, 2025 | 8:06 PM

Share

Unique Cricket Records: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే బంతికి ఎన్ని పరుగులు రాబట్టవచ్చు. మహా అయితే, ఆరు లేదా ఏడు అని అందరికీ తెలిసిందే. కానీ, ఓ ప్లేయర్ ఏకంగా 17 పరుగులతో ప్రపంచ రికార్డును సృష్టించాడని మీకు తెలుసా? ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన ప్లేయర్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ భారతదేశంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి తుఫాన్ బ్యాట్స్‌మెన్ కూడా ఒకే బంతికి 17 పరుగులు రాబట్టలేకపోయారు.

1 బంతికి 17 పరుగులు ..

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్క బ్యాట్స్‌మన్ ఈ అరుదైన లిస్ట్‌లో చేరాడు. ఒకే బంతికి 17 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ బ్యాట్స్ మాన్ మరెవరో కాదు, భారత మాజీ విస్ఫోటక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 2004 మార్చి 13న కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత మాజీ తుఫాన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తానీ బౌలర్ రాణా నవేద్-ఉల్-హసన్ వేసిన ఒక ఓవర్‌లో 17 పరుగులు రాబట్టాడు. ఇప్పటివరకు, ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్ కూడా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు.

రోహిత్, గేల్ లాంటి దిగ్గజాలు విఫలమైన చోట..

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి తుఫాన్ బ్యాట్స్‌మెన్ కూడా ఒకే బంతికి 17 పరుగులు చేసిన ఘనతను సాధించలేకపోయారు. వీరేంద్ర సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉండేది. వీరేంద్ర సెహ్వాగ్ 2015 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు భారత జట్టు వీరేంద్ర సెహ్వాగ్ లాంటి బ్యాటర్‌ను కనుగొనలేదు.

ఇవి కూడా చదవండి

1 బంతికి 17 పరుగులు ఎలా వచ్చాయంటే?

2004 మార్చి 13న, కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో, పాకిస్తానీ బౌలర్ రాణా నవేద్ ఉల్ హసన్ ఆ ఓవర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు వరుసగా 3 నో బాల్స్ వేశాడు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ రెండు బంతుల్లో ఫోర్లు కొట్టాడు. ఆ తరువాత, లీగల్ బాల్‌లో పరుగులు నమోదు కాలేదు. ఆ తరువాత, రాణా నవేద్-ఉల్-హసన్ మళ్ళీ రెండు నో-బాల్స్ వేశాడు. ఈ బంతుల్లో ఒకదానికి వీరేంద్ర సెహ్వాగ్ ఫోర్ కొట్టగా, మరొక బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. ఆ విధంగా, రాణా నవేద్ ఉల్ హసన్ వేసిన ఆ ఓవర్లో, వీరేంద్ర సెహ్వాగ్ 3 ఫోర్లతో 12 పరుగులు, 5 నో బాల్స్ నుంచి 5 అదనపు పరుగులు సాధించాడు. దీంతో ఒకే బంతికి మొత్తం 17 పరుగులు వచ్చాయన్నమాట.

సెహ్వాగ్ రికార్డులు..

వీరేంద్ర సెహ్వాగ్ భారతదేశం తరపున 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 319. వీరేంద్ర సెహ్వాగ్ 251 వన్డేల్లో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 38 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో సెహ్వాగ్ అత్యుత్తమ స్కోరు 219లుగా నిలిచింది. ఇది కాకుండా, వీరు 19 టీ20 మ్యాచ్‌ల్లో 394 పరుగులు చేశాడు. ఇందులో 68 పరుగులు అతని అత్యధిక స్కోరుగా నిలిచింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..