AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా ఆడితే, గ్రూప్ దశ నుంచే టీమిండియా ఇంటికే.. గంభీర్‌కు మొదలైన సరికొత్త టెన్షన్..?

India vs New Zealand 1st: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 48 పరుగులతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఈ గెలుపుతోపాటు గంభీర్ కు తలనొప్పి మొదలైంది.

ఇలా ఆడితే, గ్రూప్ దశ నుంచే టీమిండియా ఇంటికే.. గంభీర్‌కు మొదలైన సరికొత్త టెన్షన్..?
Ind Vs Nz Team India
Venkata Chari
|

Updated on: Jan 22, 2026 | 1:16 PM

Share

భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 21, 2026న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు విజయం సాధించినప్పటికీ, టీం ఇండియాకు కొత్త టెన్షన్ మొదలైంది. అదే పేలవమైన ఫీల్డింగ్. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు అనేక అవకాశాలను వృధా చేశారు.

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పులను ఓ పరిశీలిస్తే..

  • న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో భారత ఫీల్డర్లు కనీసం 3 కీలకమైన క్యాచ్‌లను వదిలేశారు.
  • అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ ఎంతో ఈజీ క్యాచ్ మిస్ చేశాడు.
  • మార్క్ చాప్మన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను రింకు సింగ్ పట్టుకోలేకపోయాడు.
  • అక్షర్ పటేల్ కూడా గ్లెన్ ఫిలిప్స్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు.

అదనంగా, సంజు శాంసన్ పేలవమైన వికెట్ కీపింగ్‌ను ప్రదర్శించాడు. సులభంగా చేయగలిగే రనౌట్‌ను మిస్ చేశాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన షాట్ కొట్టాడు. రింకు సింగ్ బంతిని బౌండరీ నుంచి వికెట్ కీపర్ వైపు వేగంగా విసిరాడు. ఈ సమయంలో, సంజు శాంసన్ రెండవ పరుగు కోసం పరిగెడుతున్న గ్లెన్ ఫిలిప్స్‌ను రనౌట్ చేసే అవకాశం ఉంది. కానీ శాంసన్ బంతిని పట్టుకోవడంలో ఆలస్యం చేయడం ద్వారా సులభంగా రనౌట్ అయ్యే అవకాశాన్ని మిస్ చేశాడు.

నాలుగు అవకాశాలను వృధా చేసుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. రాబోయే టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో భారత జట్టు చేసిన ఈ పేలవమైన ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది.

ఎందుకంటే, ఈ సిరీస్ తర్వాత భారత జట్టు నేరుగా టీ20 ప్రపంచ కప్‌లో ఆడనుంది. దానికి ముందు, టీమిండియా ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో 4 అవకాశాలను వృధా చేసుకోవడం కొత్త ఆందోళనకు కారణమైంది.

మొత్తం మీద, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఉన్నప్పటికీ, ఫీల్డింగ్‌లో చేసిన తప్పులు రాబోయే మ్యాచ్‌లకు భారత జట్టుకు హెచ్చరికగా మారాయి.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..