Rohit Sharma: ఇదేం ఖర్మ రోహిత్ భయ్యా.. ఓటమిలోనూ రికార్డ్ సృషించేశావ్‌గా.. దిగ్గజాల సరసన చోటు

Rohit Sharma Unwanted Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశంలో ఊహించని విధంగా పరాజయం పాలయ్యాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డులో చేరాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఘోర పరాజయం పాలైన భారత జట్టు, పూణేలో సిరీస్ సమం చేయాలని కోరుకుంటుంది.

Rohit Sharma: ఇదేం ఖర్మ రోహిత్ భయ్యా.. ఓటమిలోనూ రికార్డ్ సృషించేశావ్‌గా.. దిగ్గజాల సరసన చోటు
Rohit Sharma

Updated on: Oct 21, 2024 | 8:59 AM

Rohit Sharma Unwanted Record: బెంగళూరులో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత క్రికెట్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో స్వదేశంలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ మరో ఓటమిని చవిచూసింది. గత కొన్నేళ్లుగా స్వదేశంలో టీమిండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే భారత గడ్డపై ఓటమిని ఎదుర్కొన్న కొందరు కెప్టెన్లు కూడా ఉన్నారు. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు చేరింది. హిట్‌మ్యాన్ కెప్టెన్సీలో టీమిండియాకు ఇది మూడో ఓటమి. కాబట్టి భారత క్రికెట్ జట్టుకు టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత క్రికెట్ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు చేరింది. న్యూజిలాండ్‌పై ఓటమి రోహిత్ శర్మ కెప్టెన్సీలో స్వదేశంలో మూడో ఓటమి. దీంతో అతను భారత మాజీ కెప్టెన్లు బిషన్ సింగ్ బేడీ, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలను సమం చేశాడు. ఓవరాల్‌గా రోహిత్ శర్మ ఇప్పటివరకు 19 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించగా, అందులో 12 మ్యాచ్‌లు గెలిచి 5 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు.

అగ్రస్థానంలో మహ్మద్ అజారుద్దీన్, కపిల్ దేవ్‌లు..

భారత్ తరపున స్వదేశంలో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన జాబితాలో ఇద్దరు మాజీ వెటరన్ కెప్టెన్లు రెండో స్థానంలో ఉన్నారు. ఇందులో కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ పేర్లు ఉన్నాయి. భారత గడ్డపై కపిల్, అజహర్ 4-4 టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. మొత్తం 34 టెస్టు మ్యాచ్‌ల్లో కపిల్ దేవ్ కెప్టెన్‌గా 4 మ్యాచ్‌లు గెలిపించి, 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన అజహర్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 14 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.

అత్యధికంగా 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ..

భారత క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఆటగాడు నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా లెజెండరీ కెప్టెన్‌గా ఉన్నారు. కానీ భారత గడ్డపై అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మన్సూర్ అలీ ఖాన్ తన కెరీర్‌లో స్వదేశంలో 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. అతని కెరీర్‌లో మొత్తం 40 మ్యాచ్‌లలో టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అందులో అతను 9 మ్యాచ్‌లు గెలిచాడు. 19 మ్యాచ్‌లలో ఓడిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us