AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: టీమిండియాకు సమస్యగా మారిన రోహిత్.. పదే పదే అదే తప్పు రిపీట్..

Rohit Sharma: క్రికెట్ ప్రారంభ రోజులలో, కోచ్‌లు తరచుగా బ్యాట్స్‌మెన్‌లకు, సెట్ అయ్యాక, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ కోల్పోకూడదని చెబుతుంటారు. అయితే ఈ ఫార్ములాను రోహిత్ శర్మ అనుసరించడం లేదు. జట్టుకు శుభారంభం అందించిన తర్వాత అతను తరచూ తన వికెట్‌ను కోల్పోతున్నాడు.

World Cup 2023: టీమిండియాకు సమస్యగా మారిన రోహిత్.. పదే పదే అదే తప్పు రిపీట్..
రోహిత్ శర్మ ఇప్పటికి 40-45 సెంచరీలు చేసి ఉండేవాడు. కానీ, సెంచరీలను అంతగా పట్టించుకోడు. అతను తన కోసం కాకుండా జట్టు కోసం ఆడతాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటివరకు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఇలాగే దూసుకపోవాలని తెలిపాడు.
Venkata Chari
|

Updated on: Oct 23, 2023 | 9:07 PM

Share

Rohit Sharma In ODI World Cup 2023: ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. టోర్నీలో భారత జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 2023 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది. అయితే ఇంతలో, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పెద్ద తప్పును పదే పదే రిపీట్ చేస్తున్నాడు. రోహిత్ శర్మ చేసిన ఈ తప్పిదం భవిష్యత్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియాకు చాలా ఖరీదైనదిగా మారుతోంది. కెప్టెన్ చేసిన ఈ తప్పిదం వల్ల కూడా జట్టు మ్యాచ్‌లో ఓడిపోవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. కాబట్టి భారత కెప్టెన్ ఏం తప్పు చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి, గత రెండు మ్యాచ్‌లలో సెట్ చేసిన తర్వాత టీమ్ రోహిత్ శర్మ తన వికెట్ కోల్పోతున్నాడు. ఇది జట్టుకు ఏమాత్రం మంచిది కాదు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో జట్టుకు శుభారంభం అందించినా.. సెట్ అయ్యాక వరుసగా 48, 46 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

సెట్ అయ్యాక.. వికెట్ కోల్పోవద్దు..

క్రికెట్ ప్రారంభ రోజులలో, కోచ్‌లు తరచుగా బ్యాట్స్‌మెన్‌లకు, సెట్ అయ్యాక, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ కోల్పోకూడదని చెబుతుంటారు. అయితే ఈ ఫార్ములాను రోహిత్ శర్మ అనుసరించడం లేదు. జట్టుకు శుభారంభం అందించిన తర్వాత అతను తరచూ తన వికెట్‌ను కోల్పోతున్నాడు.

జట్టు భారీ నష్టాలను చవిచూసే అవకాశం..

రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ, కేఎస్ రాహుల్ వంటి మ్యాచ్ ఫినిషింగ్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అయితే, మంచి ప్రారంభాన్ని పొందిన తర్వాత ఇలా వికెట్ కోల్పోవడం మంచిది కాదు. ఒక మ్యాచ్‌లో జట్టు మిడిల్ ఆర్డర్ కుప్పకూలితే ఓడిపోవాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మకు శుభారంభం అందించిన తర్వాత జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లడం గురించి ఆలోచించాలి. మ్యాచ్‌ని తానే ముగించాలన్నది భారత కెప్టెన్‌ ప్రయత్నం. వన్డే ప్రపంచకప్ 2023లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ వరుసగా 0, 131, 86, 48, 46 పరుగులు చేయడం గమనార్హం.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..