AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: బీసీసీఐ నిర్ణయంతో రిటైర్మెంట్ బాటలో నలుగురు.. లిస్టులో ఊహించని ప్లేయర్లు?

టీమ్ ఇండియాలో నలుగురు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్లంతా అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ కావచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు ఆటగాళ్లను టీమ్ ఇండియా నుంచి బీసీసీఐ తొలగించింది. ఈ నలుగురు భారతీయ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసింది. భారత జట్టు తలుపులు కూడా వీరికి క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

Team India: బీసీసీఐ నిర్ణయంతో రిటైర్మెంట్ బాటలో నలుగురు.. లిస్టులో ఊహించని ప్లేయర్లు?
Team India Players
Venkata Chari
|

Updated on: Oct 15, 2024 | 9:45 AM

Share

Team India: టీమ్ ఇండియాలో నలుగురు బలమైన ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఈ ఆటగాళ్లంతా అంతర్జాతీయ క్రికెట్ నుంచి త్వరలో రిటైర్ కావచ్చు అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు ఆటగాళ్లను టీమ్ ఇండియా నుంచి బీసీసీఐ తొలగించింది. ఈ నలుగురు భారతీయ ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసింది. భారత జట్టు తలుపులు కూడా వీరికి క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ, వీరు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. భారత క్రికెట్ జట్టులో ఎంపిక కావడం ఎంత కష్టమో, టీమ్ ఇండియాలో నిలదొక్కుకోవడం అంతకన్నా చాలా రెట్లు కష్టం. వాళ్లు ఎవరో ఓసారి చూద్దాం..

1. భువనేశ్వర్ కుమార్..

2012లో భువనేశ్వర్ కుమార్ కెరీర్ ప్రారంభించినప్పుడు, స్వింగ్ అతని బలం. నేటికీ దానిని నమ్ముకున్నాడు. కానీ, ఇటీవల అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. భువనేశ్వర్ టెస్ట్ క్రికెట్‌లో తన స్వింగ్ బౌలింగ్‌ను కూడా నిరూపించుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తు భువీ గాయాల కారణంగా చాలాసార్లు జట్టులోకి, వెలుపల వస్తూ వెళ్తున్నాడు. 2018లో గాయం కారణంగా, భువీ టెస్ట్ క్రికెట్ వంటి సుదీర్ఘ ఫార్మాట్‌లకు దూరం కావడం ప్రారంభించాడు. అప్పటి నుంచి అతనికి ఒక్క టెస్టులో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు భువీకి టెస్టు క్రికెట్ ముగిసినట్టేనని తేలిపోయింది. భువనేశ్వర్ కుమార్ భారత్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. భువనేశ్వర్ కుమార్ భారత్ తరపున 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. టెస్టు మ్యాచ్‌ల తర్వాత ఇప్పుడు వన్డే, టీ20 జట్ల నుంచి కూడా అతడిని తప్పించారు.

2. వృద్ధిమాన్ సాహా..

వృద్ధిమాన్ సాహా చాలా మంచి వికెట్ కీపర్. అయితే, అతనికి టెస్టు క్రికెట్‌లో ఆడే అవకాశం రాలేదు. సాహా 2010లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి సాహా కేవలం 40 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. 40 ఏళ్ల వృద్ధిమాన్ సాహాకు సంబంధించి, భారత జట్టు మేనేజ్‌మెంట్ సెలెక్టర్లకు వారి భవిష్యత్తు ప్రణాళికలలో చేర్చలేదు. 2022లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొండిచేయి చూపించారు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేయగలడన్న ఈ ఆటగాడి ఆశలు దాదాపుగా ముగిశాయి. సాహా టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను 40 టెస్టుల్లో 29.41 సగటుతో 1353 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు కనిపించాయి.

3. కరుణ్ నాయర్..

చెన్నైలో ఇంగ్లండ్‌పై కరుణ్‌ నాయర్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసినపుడు కరుణ్‌ నాయర్‌ లాంగ్‌ హార్స్‌ అని అనిపించినా, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత, అతను రాణించలేకపోయాడు. అందుకే అతను జట్టు నుంచి తొలగించారు. కరుణ్ నాయర్ నవంబర్ 2016లో ఇంగ్లండ్‌పై తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అతను చివరిసారిగా మార్చి 2017లో ఆస్ట్రేలియాతో ఆడాడు. అతను తన కెరీర్‌లో కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 303 పరుగులు.

4. ఇషాంత్ శర్మ..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసింది. ఇషాంత్ శర్మ చివరిసారిగా నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో కనిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్ట్ ఆడిన తర్వాత, ఇషాంత్ శర్మకు మళ్లీ టీమ్ ఇండియాకు ఆడే అవకాశం ఇవ్వలేదు. టీమ్ ఇండియాలో పోటీ నిరంతరం పెరుగుతోంది. షమీ, బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్లు టెస్టు ఫార్మాట్‌లో రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా నుంచి ఇషాంత్ శర్మ కార్డు కట్ అయింది. ఇషాంత్ శర్మ 100కి పైగా టెస్టులు ఆడాడు. అందులో అతను తన పేరిట 311 వికెట్లు లిఖించుకున్నాడు. ఇషాంత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ చేయాల్సిందేనని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..