T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!

టీ20 వరల్డ్ కప్ 2021 మొదటి ఫైనలిస్ట్ ఖరారైంది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం నమోదు..

T20 World Cup 2021: సెమీఫైనల్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం!
Pakistan
Follow us

|

Updated on: Nov 11, 2021 | 1:35 PM

టీ20 వరల్డ్ కప్ 2021 మొదటి ఫైనలిస్ట్ ఖరారైంది. బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుత విజయం నమోదు చేసుకుని న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక రెండో ఫైనలిస్ట్ ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. ఇవాళ పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య సెకండ్ సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందుగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్‌లకు తేలికపాటి జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల బుధవారం వారిరువురూ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదట. దీనిపై జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయితే వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు జరపగా.. నెగటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిగతా టీం మొత్తానికి కూడా కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ వచ్చిందట.

జట్టును అజేయంగా నిలపడంలో ఈ ఇద్దరూ కీలకం..

ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని ఏకైక జట్టు పాకిస్థాన్‌. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-12లోకి దూసుకెళ్లింది. ఇక పాకిస్తాన్ జట్టు విజయాల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి. ఇక సరిగ్గా సెమీఫైనల్ టైంలో వీరిద్దరూ జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉండగా.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక మాలిక్ జట్టు మిడిల్ ఆర్డర్ భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకున్నాడు. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లపై లక్ష్యాన్ని ఛేదించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. స్కాట్లాండ్‌పై అతడి ఫాస్టెస్ట్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. కాగా, ఈ ఇద్దరి ఆటగాళ్ల స్థానంలో పాకిస్తాన్ టీం యాజమాన్యం.. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఓపెనర్ ఫకార్ జమాన్ తీసుకునే అవకాశం ఉంది.

Also Read:

3 మ్యాచులు.. 23 బంతులు.. అత్యధిక స్కోర్ 27 పరుగులే.. అయినా ఐసీసీ గౌరవించింది.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

Zodiac Signs: ఈ 3 రాశులవారు చాలా ఎమోషనల్.. కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. ఆ రాశులేంటి.!

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ