AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav : సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నా సూర్యపై ఎందుకు వేటు వేస్తున్నారు? ఆ 3 వివాదాలే కారణమా?

Suryakumar Yadav : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరిగా నిలిచారు. అతని కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడమే కాకుండా, ఆసియా కప్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను ముద్దాడింది.

Suryakumar Yadav : సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్నా సూర్యపై ఎందుకు వేటు వేస్తున్నారు? ఆ 3 వివాదాలే కారణమా?
Suryakumar
Rakesh
|

Updated on: Jun 05, 2026 | 3:48 PM

Share

Suryakumar Yadav : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకరిగా నిలిచారు. అతని కెప్టెన్సీలో టీమిండియా వరుసగా ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడమే కాకుండా, ఆసియా కప్ 2025, టీ20 వరల్డ్ కప్ 2026 వంటి ప్రతిష్టాత్మక టైటిళ్లను ముద్దాడింది. అయితే, ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్నప్పటికీ, గత 18 నెలలుగా బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా, జట్టులో అతని స్థానంపై కూడా బీసీసీఐ పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మీడియాను వినూత్నంగా హ్యాండిల్ చేయడం వల్ల తలెత్తిన మొదటి మూడు పెద్ద వివాదాలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

1. సంజూ శాంసన్ ఎంపికపై ప్రెస్ మీట్‌లో నవ్వులు.. నెటిజన్ల ఫైర్

టీ20 వరల్డ్ కప్ 2026 సమయంలో సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవడంపై జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెద్ద వివాదానికి దారితీసింది. వెస్టిండీస్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌కు ముందు, సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు సూర్యను ప్రశ్నించారు. దానికి సూర్యకుమార్ నేరుగా సమాధానం చెప్పకుండా, నవ్వుతూ.. “సంజూని జట్టులోకి తీసుకోవాలంటే మీరే చెప్పండి.. టీమ్‌లో ఉన్న ఎవరిని తీసేయమంటారు?” అని సరదాగా అడిగారు. ఈ సమాధానానికి ప్రెస్ రూమ్‌లోని వారు నవ్వినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. సీనియర్ ఆటగాడైన సంజూ శాంసన్ పట్ల సూర్య అగౌరవంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఆ తర్వాత అదే టోర్నమెంట్‌లో సంజూ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకోవడంతో సూర్యపై మరింత ట్రోలింగ్ జరిగింది.

2. పాకిస్థాన్‌పై గెలుపును ఆర్మీకి అంకితం ఇవ్వడం.. ఐసీసీ పెనాల్టీ

ఆసియా కప్ 2025లో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, భారత సాయుధ దళాల‎కు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నట్లు సూర్య ప్రకటించారు. అంతేకాకుండా, ఆ టోర్నమెంట్‌లో తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు, ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, క్రీడల్లో రాజకీయ లేదా దేశభక్తి అంశాలను తీసుకురావడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకు గాను సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డెమెరిట్ పాయింట్లను విధించింది.

3. ఆసియా కప్‌లో పాక్ ఆటగాళ్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వని వివాదం

ఆసియా కప్ 2025 సమయంలోనే మరో పెద్ద వివాదం అంతర్జాతీయ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లకు ముందు, మ్యాచ్‌లు ముగిసిన తర్వాత సాంప్రదాయకంగా ఇచ్చుకునే షేక్‌హ్యాండ్స్ కార్యక్రమానికి భారత జట్టు దూరంగా ఉంది. బీసీసీఐ, భారత ప్రభుత్వం ఇచ్చిన మద్దతుతో టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూనే తాము పాక్ ఆటగాళ్లకు దూరంగా ఉన్నామని సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు స్పష్టం చేసింది. అయితే, ఈ చర్య క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‎కు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో ఇది పెద్ద రాజకీయ, క్రికెట్ వివాదంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us