AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: జర్నలిస్ట్ ప్రశ్నకు నోరెళ్లబెట్టిన ఆజామూ! సమయానికి దేవుడిలా వచ్చి కాపాడిన ఫ్రెండ్!

పాక్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలపై జర్నలిస్టు బాబర్ అజంను ప్రశ్నించగా, ఆయన మౌనంగా ఉండిపోయాడు. రిజ్వాన్ కూడా స్పందించకపోవడంతో, షాహీన్ ఆఫ్రిది సమర్థంగా సమాధానం ఇచ్చాడు. బ్యాటర్లు, బౌలర్లు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని షాహీన్ హైలైట్ చేశాడు. పాక్ జట్టు ప్రస్తుత పరిస్థితులు, పునర్నిర్మాణం పట్ల శ్రద్ధ అవసరమన్నది స్పష్టమవుతోంది.

Video: జర్నలిస్ట్ ప్రశ్నకు నోరెళ్లబెట్టిన ఆజామూ! సమయానికి దేవుడిలా వచ్చి కాపాడిన ఫ్రెండ్!
Shaheen Afridi Babar Azam
Follow us
Narsimha

|

Updated on: Apr 12, 2025 | 6:30 PM

పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు తీవ్ర విమర్శలు, నిరాశల మధ్య నడుస్తోంది. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో జట్టు విఫలమవడం పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 10వ సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పాకిస్తాన్ జట్టులోని ప్రముఖులు బాబర్ అజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ ఆఫ్రిది పరిస్థితి. ఈ సందర్భంగా ఒక జర్నలిస్టు బాబర్‌ను ప్రసిద్ధ ప్రశ్నతో నిలదీశాడు.. “మన జట్టు 200 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాలను సాధించడంలో ఎందుకు విఫలమవుతోంది? లోపమా? లేక ఉద్దేశంలో లోటా?” అని. అయితే ఈ ప్రశ్నకు బాబర్ ఏమీ స్పందించలేదు, ఆయన బాధ్యతను రిజ్వాన్ కు సమాధానమిచ్చాడు. కానీ రిజ్వాన్ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో పేసర్ షాహీన్ ఆఫ్రిది చొరవ తీసుకుని ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

షాహీన్ ఆఫ్రిది మాట్లాడుతూ, “ఇది ఒక బాధ్యత కాదు. మనం ఒక జట్టు, మనం ఒక కుటుంబం. 200 పరుగులు లక్ష్యంగా ఉంటే అది కేవలం బ్యాటర్ల పనే కాదు, అలాంటి స్కోరు ఇవ్వకూడదన్న బౌలర్లదీ కూడా. మన పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే, అలాంటి లక్ష్యాలను కాపాడటానికి ప్రయత్నించాలి. బ్యాటర్లు, బౌలర్లు కలిసి పనిచేస్తేనే జట్టు విజయాల దిశగా సాగుతుంది. ప్రస్తుతానికి మనం కొన్ని ఆటల్లో విజయాలను కోల్పోయిన, పాక్ క్రికెట్‌ను తిరిగి గౌరవ స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది,” అని సమర్థంగా సమాధానమిచ్చాడు.

ఇటీవల పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం ఎక్కువైంది. మహ్మద్ రిజ్వాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు గ్రూప్ దశలో న్యూజిలాండ్, భారత్ చేతిలో పరాజయాల అనంతరం నిష్క్రమించాల్సి ఉంది. వచ్చింది. ఈ విఫలమైన ప్రదర్శన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 2026 T20 ప్రపంచకప్, 2027 ODI ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకుని ఒక నూతన జట్టు నిర్మాణాన్ని ప్రారంభించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు పాక్ జట్టు, ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వడంతో పాటు కొంతమంది అనుభవజ్ఞులను కొనసాగించినా, పాక్ జట్టు 4-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. వన్డే సిరీస్‌కు బాబర్ అజం, రిజ్వాన్ తిరిగి జట్టులోకి వచ్చా, కివీస్ జట్టు వారిని 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. ఈ పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్ పై మరోసారి తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..