AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం తాగి కొట్టారు సామీ.. 2 సిక్స్‌లు, 13 ఫోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే భారీ రికార్డ్

Shubman Gill and Sai Sudharsan: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. దీనికి ప్రధాన కారణం శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్‌ల అద్భుతమైన బ్యాటింగ్. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి, మొదటి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ సీజన్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా రికార్డులకు ఎక్కింది.

ఏం తాగి కొట్టారు సామీ.. 2 సిక్స్‌లు, 13 ఫోర్లతో బీభత్సం.. కట్‌చేస్తే.. ఐపీఎల్ 2025లోనే భారీ రికార్డ్
Ipl 2025 Lsg Vs Gt
Follow us
Venkata Chari

|

Updated on: Apr 12, 2025 | 6:24 PM

Shubman Gill and Sai Sudharsan: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టు అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని ఈ జట్టు అందరి అంచనాల కంటే భిన్నంగా రాణిస్తోంది. దీనికి ప్రధాన కారణం జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఆరో మ్యాచ్‌లో వీరిద్దరు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు.

లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ శుభారంభం చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గుజరాత్ తరపున పరుగుల వర్షం కురిపిస్తోన్న సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అర్ధ సెంచరీ సాధించాడు.

లక్నోపై అర్ధ సెంచరీ..

గత మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే ఔటైన గిల్.. ఈసారి కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది రెండో అర్ధ సెంచరీ. గిల్ తర్వాత, సుదర్శన్ కూడా తన అర్ధ సెంచరీ సాధించాడు. సుదర్శన్ కేవలం 32 బంతుల్లోనే ఈ సీజన్‌లో తన నాలుగో అర్ధ సెంచరీని సాధించాడు. వీరిద్దరూ పవర్‌ప్లేలోనే జట్టును 50 పరుగుల మార్కును దాటించారు. 10వ ఓవర్‌లో 100 పరుగులు పూర్తి చేశారు. గిల్ 38 బంతుల్లో 60 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 37 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2025లో భారీ భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించారు. శుభ్‌మాన్ గిల్ వికెట్ పడటంతో ఈ ఇద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. అయితే, ఈ భాగస్వామ్యం ఆధారంగా, ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఈ ఎడిషన్‌లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా రికార్డు సృష్టించారు. యాదృచ్చికంగా, ఈ రికార్డు గతంలో లక్నో పేరిట ఉండేది. లక్నో తరపున మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అత్యధిక భాగస్వామ్యంతో పాటు, గిల్, సుదర్శన్ ఐపీఎల్ చరిత్రలో కేవలం 24 ఇన్నింగ్స్‌లలో 12వ సారి 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మొదటి జోడీగా నిలిచారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..