Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ ఔట్.. కొత్తగా వచ్చేది ఎవరంటే?

Team India Head Coach: టీమిండియా కొత్త కోచ్ నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా ధ్రువీకరించారు. 2021 నవంబర్ నుంచి టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతని కాంట్రాక్ట్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ, ద్రవిడ్‌కు మరోసారి పొడిగింపు ఇచ్చేలా కనిపించడం లేదు. బోర్డు త్వరలో కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేస్తుంది.

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ ఔట్.. కొత్తగా వచ్చేది ఎవరంటే?
Rahul Dravid

Updated on: May 10, 2024 | 2:30 PM

Team India Head Coach: టీమిండియా కొత్త కోచ్ నియామకానికి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జయ్ షా ధ్రువీకరించారు. 2021 నవంబర్ నుంచి టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అతని కాంట్రాక్ట్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ, ద్రవిడ్‌కు మరోసారి పొడిగింపు ఇచ్చేలా కనిపించడం లేదు. బోర్డు త్వరలో కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేస్తుంది. భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ప్రస్తుత బీసీసీఐతో కుదుర్చుకున్న ఒప్పందం జూన్‌లో ముగుస్తుంది. అప్పుడు భారత జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ ప్రచారంలో పాల్గొంటుంది.

2023 నవంబర్లో భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ తన సహాయక సిబ్బందితో కలిసి రంగంలోకి దిగాడు. కానీ, కొత్త కాంట్రాక్ట్ 2024 జూన్ చివరి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాగా, ద్రవిడ్ కోరుకుంటే ఈ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే మునుపటిలా ఆటోమేటిక్ పొడిగింపు ఉండదని జయ్ షా ధృవీకరించారు.

రాహుల్ పదవీకాలం జూన్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి, అతను దరఖాస్తు చేయాలనుకుంటే, చేయవచ్చు” అని బీసీసీఐ కార్యదర్శి క్రిక్ బజ్‌కు తెలిపారు. అయితే, విదేశీ కోచ్‌ను నియమించే అంశాన్ని తోసిపుచ్చారు.

ఇవి కూడా చదవండి

‘కొత్త కోచ్ భారతీయుడా, విదేశీయుడా అనేది మేం నిర్ణయించలేం. అది సీఏసీదే, మాది గ్లోబల్ బాడీ’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఇతర అంతర్జాతీయ బోర్డుల మాదిరిగానే వివిధ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్లను నియమించే అవకాశాలను షా తోసిపుచ్చారు.

ఆ నిర్ణయాన్ని కూడా సీఏసీ తీసుకుంటుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆల్ ఫార్మాట్ ఆటగాళ్లు ఉన్నారు. పైగా, భారత్ లో ఇలాంటి పరిస్థితి వచ్చిన దాఖలాలు లేవన్నారు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మతో సహా క్రియాశీల అంతర్జాతీయ ఆటగాళ్ల నుంచి చాలా విమర్శలను ఎదుర్కొన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై షా మాట్లాడుతూ.. ఈ విషయాన్ని ఫ్రాంచైజీతో చర్చించి, నిబంధనను కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తానని అమిత్ షా చెప్పారు.

‘ఇంపాక్ట్ ప్లేయర్ ఓ టెస్టింగ్ ప్రక్రియ. ఐపీఎల్లో ఇద్దరు కొత్త భారత ఆటగాళ్లకు అవకాశం లభిస్తోంది’ అంటూ తెలిపారు. కాగా, ఈ విధానంతో ఆల్ రౌండర్ల అభివృద్ధికి ఈ నిబంధన ఆటంకం కలిగిస్తోందని పేర్కొన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే ముందు వాటాదారులు – ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్టర్లతో చర్చిస్తాం. ఇది శాశ్వతం కాదు. కానీ, ఈ నిబంధనకు వ్యతిరేకంగా ఎవరూ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..