AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: పాయింట్లు తగ్గిస్తే ఇబ్బందేమి లేదు.. కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి..

తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) పాయింట్‌ను కోల్పోయిన తమ జట్టు మెరుగైన చేయాలని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు.

IND vs SA: పాయింట్లు తగ్గిస్తే ఇబ్బందేమి లేదు.. కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలి..
Dravid
Srinivas Chekkilla
| Edited By: |

Updated on: Jan 03, 2022 | 9:46 AM

Share

సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) పాయింట్‌ను కోల్పోయిన తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆదివారం అంగీకరించాడు. ఓవర్ రేట్ తక్కువగా ఉంటే WTC పాయింట్ల నుండి తగ్గింపు ఏ జట్టుకైనా ఫైనల్‌కు చేరుకోవడం కష్టతరం చేస్తుంది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ టెస్టులో ఎనిమిది ఓవర్లు తక్కువ సమయంలో బౌలింగ్ చేసినందుకు ఇంగ్లాండ్‌కు ఎనిమిది WTC పాయింట్లు జరిమానా విధించారు.

జోహన్నెస్‌బర్గ్‌లో రెండో టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ద్రవిడ్ మాట్లాడుతూ “ఐసీసీ స్పష్టంగా ఏదో చేయాలని ప్రయత్నిస్తోంది. కోచ్‌గా ఇది చికాకు కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది కొంచెం నిరుత్సాహపరుస్తుందన్నారు. ఐసీసీ చేసిన కొత్త నిబంధనపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే పాయింట్లను తగ్గించే ముందు పరిస్థితులపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని ద్రవిడ్ అన్నాడు. “ఐసీసీ ఇప్పుడు పాయింట్లను తగ్గించే పద్ధతిని అవలంబించింది. దీనితో మాకు ఎలాంటి సమస్య లేదు. అయితే పరిస్థితులకు అనుగుణంగా కొంత సడలింపు ఇవ్వాలి.” అని అన్నాడు.

“బుమ్రా గాయపడినప్పుడు, ఫిజియో చాలా సమయం (ఫీల్డ్‌లో) గడపవలసి వచ్చింది. చివరిసారి బంతిని మార్చడంలో కొన్ని ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భారత జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో మ్యాచ్ ఆడుతుండడంతో ఓవర్ రేట్‎ను కొనసాగించడం జట్టుకు ఇబ్బందిగా మారింది.” అని పేర్కొన్నారు.

Read Also.. IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..

వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
వాట్సప్‌లోనే మీ-సేవ సేవలు.. ప్రభుత్వం అప్డేట్
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు