AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఫిక్స్.. రో-కో రీఎంట్రీ.. ఆ ఇద్దరికి మొండిచేయి..?

India vs Australia ODI Series: అక్టోబర్‌లో టీం ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో, రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావచ్చు. ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరిసారిగా కనిపించారు.

IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఫిక్స్.. రో-కో రీఎంట్రీ.. ఆ ఇద్దరికి మొండిచేయి..?
India Vs Australia
Venkata Chari
|

Updated on: Aug 26, 2025 | 12:12 PM

Share

India vs Australia: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025లో టీం ఇండియా పాల్గొంటుంది. ఈ టోర్నమెంట్ తర్వాత, భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టులో భాగం కాని సీనియర్ ఆటగాళ్ళు ఈ పర్యటనలో తిరిగి రావొచ్చు. ఇటువంటి పరిస్థితిలో, అభిమానులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జంటను మళ్ళీ మైదానంలో కలిసి ఆడటం చూడవచ్చు. ఈ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా జట్టు ఏ విధంగా ఉంటుందో చూద్దాం.

ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్-రోహిత్ రీఎంట్రీ..

అక్టోబర్‌లో టీం ఇండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో, రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావచ్చు. ఫిబ్రవరిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరిసారిగా కనిపించారు.

టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన తర్వాత, రోహిత్, విరాట్ మొత్తం దృష్టి వన్డే క్రికెట్ పైనే ఉంది. సెలెక్టర్లు ఆస్ట్రేలియాతో జరిగే 15 మంది సభ్యుల జట్టులో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఇద్దరినీ చేర్చవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించడం ద్వారా తన విమర్శకులకు తగిన సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. అతని రిటైర్మెంట్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న వారికి స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రోహిత్ శర్మ ఇప్పటికే తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, మరికొన్ని సంవత్సరాలు దేశానికి తోడ్పడాలని కోరుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే.

బుమ్రా, హార్దిక్ తిరిగి రావచ్చు..

ఆస్ట్రేలియాకు వెళ్లి వారిని ఓడించగలిగేది టీం ఇండియా మాత్రమే. కంగారూ జట్టుకు భారత్ ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితిలో, సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాళ్లను తిరిగి రావాలని పిలుపునివ్వవచ్చు. హార్దిక్ పాండ్యా ఫిబ్రవరి నుంచి ఏ మ్యాచ్ ఆడలేదు. అతను తన కుటుంబంతో సెలవులు గడుపుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయవచ్చు.

పాండ్యా తన బ్యాటింగ్, బౌలింగ్‌తో తన మ్యాజిక్ ని ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుంటాడు. మరోవైపు, ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని నడిపించగలడు. అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. బుమ్రా తన వన్డే కెరీర్ లో అత్యధిక వికెట్లు తీసిన జట్టు ఆస్ట్రేలియా. ఈ జట్టుతో జరిగిన 21 మ్యాచ్ లలో అతను 30 వికెట్లు పడగొట్టాడు.

అయ్యర్, సంజుకి నిరాశ..

స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తిరిగి ఆడవచ్చు. నివేదిక ప్రకారం, అతని కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. వన్డే సిరీస్‌లో అతను తిరిగి రావచ్చు. తిరిగి వచ్చిన తర్వాత, సంజు శాంసన్‌కు భారీ షాక్ తగలవచ్చు. పంత్ ఎంపిక తర్వాత, ఈ పర్యటనకు అతన్ని ఎంపిక చేయడం సాధ్యం కాదని అనిపిస్తుంది.

వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలో భాగమైతే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించే అవకాశం ఉంది. ఎందుకంటే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే మిడిల్ ఆర్డర్‌లో తమ స్థానాన్ని దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ కు టీమిండియా ప్రాబబుల్ స్వ్కాడ్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

IND vs AUS 2025 : ODI సిరీస్ షెడ్యూల్..

మ్యాచ్ తేదీ వేదిక భారత ప్రామాణిక సమయం (IST)
1వ వన్డే 19 అక్టోబర్ 2025 పెర్త్ ఉదయం 9:00 గంటలకు
2వ వన్డే 23 అక్టోబర్ 2025 అడిలైడ్ ఉదయం 9:00 గంటలకు
3వ వన్డే 25 అక్టోబర్ 2025 సిడ్నీ ఉదయం 9:00 గంటలకు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..