AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyansh Arya: డీపీఎల్‌లో ప్రియాంష్ అద్భుత సెంచరీ.. ఆ ఒక్క తప్పు వల్ల మ్యాచ్ ఓటమి..

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రియాంష్ ఆర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు. కానీ అతడు చేసిన ఓ తప్పు వల్ల తన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రియాంష్ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఈ ఫీల్డింగ్ ఈ ఓటమికి కారణమైంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Priyansh Arya: డీపీఎల్‌లో ప్రియాంష్ అద్భుత సెంచరీ.. ఆ ఒక్క తప్పు వల్ల మ్యాచ్ ఓటమి..
Priyansh Arya DPL
Krishna S
|

Updated on: Aug 08, 2025 | 11:41 PM

Share

ఐపీఎల్లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన ప్రియాంష్ ఆర్య ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ తరపున ఆడుతున్నాడు. శుక్రవారం ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ప్రియాంష్ సూపర్ సెంచరీ సాధించి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్కును దాటించాడు. అయితే ప్రియాంష్ చేసిన ఒక తప్పు తన జట్టును ఓడిపోయేలా చేసింది. నిజానికి ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ప్రియాంష్ ఆర్య ఫీల్డింగ్‌లో పొరపాటు చేశాడు. దీని వల్ల టీమ్ ఓటమి పాలైంది.

అనుజ్ క్యాచ్‌ మిస్..

అనుజ్ ఆర్య ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డింగ్ కూడా చేస్తాడు. కానీ ఈస్ట్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఒక ముఖ్యమైన క్యాచ్‌ను వదిలేశాడు. నిజానికి.. ఈస్ట్ ఢిల్లీ జట్టు కెప్టెన్ అనుజ్ రావత్ క్యాచ్‌ను ప్రియాంష్ వదిలేశాడు. ఫలితంగా.. ప్రియాంష్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రియాంష్ నుంచి లైఫ్ అందుకున్న అనుజ్ రావత్ కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 9 సిక్సర్లు బాదాడు. ఓపెనర్ అర్పిత్ రాణాతో కలిసి అనుజ్ 59 బంతుల్లో 130 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం బలంతో, తూర్పు ఢిల్లీ జట్టు ఔటర్ ఢిల్లీ నిర్దేశించిన 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

వారియర్స్ రెండో ఓటమి

ఔటర్ ఢిల్లీ వారియర్స్ ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉండే. కానీ ప్రియాంష్ ఆర్య చేసిన తప్పు జట్టును ఓటమి వైపు నడిపించింది. తాజా పాయింట్ల పట్టిక ప్రకారం.. ప్రియాంష్ జట్టు 4 మ్యాచ్‌ల్లో 3 ఓడిపోయి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. మరోవైపు ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి రెండవ స్థానంలో ఉంది. సెంట్రల్ ఢిల్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో ఉంది. తూర్పు ఢిల్లీ విషయానికొస్తే, వారి కెప్టెన్ అనుజ్ రావత్ ప్రస్తుతం 228 పరుగుల అత్యధిక స్కోరుతో టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. అర్పిత్ రాణా 206 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.