Pakistan Jersey: మరో వివాదంలో పాకిస్తాన్.. టీ20 ప్రపంచ కప్ జెర్సీపై ISI లోగో.. ఎందుకో తెలుసా?
Pakistan T20I World Cup Jersey: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ కోసం తన జెర్సీని ఆవిష్కరించింది. ఆసక్తికరంగా, ఈ జెర్సీలో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) లోగోపై కూడా కనిపించే జంతువు ఫొటో ఉండడం వివాదానికి తెర లేపింది.

Pakistan T20I World Cup Jersey: టీ20 ప్రపంచ కప్ కు ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివాదంలో చిక్కుకుంది. భారత్ తో జరిగే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆడటానికి పీసీబీ నిరాకరించి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. మరో వివాదానికి తెర లేపింది. ఈ వివాదం నడుమ, పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచ కప్ జెర్సీని విడుదల చేసింది. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ జెర్సీలో మార్ఖోర్ అనే జంతువు ఫొటో ఉంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు, దాని ఫొటో జెర్సీపై కనిపించేలా ప్రింట్ చేసింది. ఆసక్తికరంగా, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా ఈ ఫొటోను ఉపయోగిస్తుంది.
పాకిస్తాన్ జెర్సీ ఆవిష్కరణ..
Incase if you didn’t know.
Pakistan cricket board has printed “Markhor” on the World Cup jersey, the symbol of the ISI and the national animal of Pakistan 🪖💚 pic.twitter.com/HBNMiLcfBM
— 𝐀. (@was_abdd) February 2, 2026
పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ జెర్సీ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కానీ మధ్యలో నల్లటి గుర్తులు కూడా ఉంటాయి. అభిమానులు దీనిని ట్రోల్ చేస్తున్నారు. ఈ జెర్సీలో మార్ఖోర్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇలా పాకిస్తాన్ జెర్సీ తొలిసారి ప్రింట్ చేయడం గమనార్హం. మార్ఖోర్ అనేది అడవి మేక జాతి, ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది హిమాలయాలు, కారకోరంలోని ఎత్తైన పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది పాకిస్తాన్ జాతీయ జంతువు. జమ్మూ, కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్లో కూడా కనిపిస్తుంది.
పాకిస్తాన్ వివాదాస్పద నిర్ణయం..
Which Picasso did PCB hire? He got 2 pics from internet and added them to jersey. I saw so many better original designs from random Pak fans on my TL but pcb rarely pay heed to what fans want. pic.twitter.com/veI6oP5Y2n
— Usama Zafar (@Usama7) February 2, 2026
పాకిస్తాన్ జట్టు శ్రీలంకకు చేరుకుంది. అక్కడ తమ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను ఆడనుంది. అయితే, పాకిస్తాన్ భారత్తో లీగ్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించడం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. పాకిస్తాన్ ఈ చర్య వల్ల ఐసీసీకి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతుంది. అందుకే ఐసీసీ పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ భారత్తో జరిగే లీగ్ మ్యాచ్ను బహిష్కరిస్తే, అది కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
