AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

2025 ఆసియా కప్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సంక అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిస్సంక ఆ మ్యాచ్‌లో కేవలం సెంచరీ చేయడమే కాదు, ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. అతని ప్రదర్శన ఎంత గొప్పగా ఉందో, అతని నేపథ్యం అంతకంటే అద్భుతంగా ఉంది.

Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
Pathum Nissanka
Rakesh
|

Updated on: Sep 27, 2025 | 8:53 AM

Share

Pathum Nissanka : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే మాట వినే ఉంటారు. కానీ, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఆటగాడు ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. ఆ అద్భుత ప్రదర్శన శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ పతుమ్ నిస్సాంకదే. సెప్టెంబర్ 26న భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో అతను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అతను ఎంత గొప్పగా ఆడాడో, అతని వెనుక ఉన్న జీవిత కథ కూడా అంతే గొప్పది. మైదానాన్ని శుభ్రం చేసే ఉద్యోగి (గ్రౌండ్ బాయ్) కొడుకైన నిస్సాంక, పేదరికాన్ని జయించి, తన ఆటతో విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ క్రికెటర్‌ రికార్డునే బద్దలు కొట్టాడు.

శ్రీలంక క్రికెట్‌లో ప్రస్తుతం కీలక ఆటగాడు పతుమ్ నిస్సాంక. అతని ఆటతీరు ఎంత అద్భుతంగా ఉంటుందో, అతని వెనుక ఉన్న జీవిత కథ కూడా అంతే స్ఫూర్తిదాయకం. పతుమ్ నిస్సాంక తండ్రి వృత్తిరీత్యా గ్రౌండ్ బాయ్ (మైదానాన్ని శుభ్రం చేసే ఉద్యోగి). ఆయన ఆదాయం చాలా తక్కువగా ఉండేది. ఇంటి ఖర్చుల కోసం తల్లి గుడి బయట పూలు అమ్మేవారు. పతుమ్ నిస్సాంక బాల్యం ఎంతో పేదరికంలో గడిచింది. కానీ, క్రికెట్‌పై ఉన్న తన నైపుణ్యం, ఆసక్తితో తల్లిదండ్రులను ఆ పేదరికం నుండి బయటపడేసే పని చేశాడు. ప్రస్తుతం అతను శ్రీలంక క్రికెట్‌లో కీలక ఆటగాడిగా, స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగాడు.

భారత్‌పై నిస్సాంక మెరుపులు, 3 అద్భుతమైన రికార్డులు

భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో పతుమ్ నిస్సాంక తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. అతను 184.48 స్ట్రైక్ రేట్‌తో, కేవలం 58 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. ఇందులో 6 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో అతను ఒకే మ్యాచ్‌లో మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. ఆసియా కప్ 2025లో సెంచరీ సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్గా నిలిచాడు. శ్రీలంక తరపున మూడు ఫార్మాట్‌లలో (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు చేసిన నాల్గవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆసియా కప్ 2025లో ఓడిన జట్టు తరపున ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న మొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు

పతుమ్ నిస్సాంక తన అద్భుతమైన ప్రదర్శనతో T20 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు T20 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌లలో 9 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 429 పరుగులు సాధించాడు. తాజా సెంచరీతో పతుమ్ నిస్సాంక T20 ఆసియా కప్ చరిత్రలో మొత్తం 434 పరుగులు చేశాడు. అతను 12 మ్యాచ్‌లలో 12 ఇన్నింగ్స్‌లలో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

దీంతో పాటు, T20 ఆసియా కప్ చరిత్రలో సెంచరీ చేసిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిస్సాంక నిలిచాడు. ఈ జాబితాలో అతని కంటే ముందు భారత్ నుంచి విరాట్ కోహ్లీ, హాంకాంగ్ నుంచి బాబర్ హయత్ ఉన్నారు. పేదరికం నుండి వచ్చిన ఈ యువ ఆటగాడు, తన నిబద్ధత, నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్‌లోనే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..