AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆసీస్‌కు మరో బ్యాడ్‌న్యూస్.. వన్డేలకు దూరం కానున్న స్టార్ ప్లేయర్.. సారథిగా ఎవరంటే?

Pat Cummins: ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూసింది. భారత్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు కట్టుకుని మైదానానికి వచ్చారు.

IND vs AUS: ఆసీస్‌కు మరో బ్యాడ్‌న్యూస్.. వన్డేలకు దూరం కానున్న స్టార్ ప్లేయర్.. సారథిగా ఎవరంటే?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Mar 10, 2023 | 12:41 PM

Share

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూశారు. కమిన్స్ తల్లి గత రాత్రి తుది శ్వాస విడిచారు. అతని తల్లి మృతి పట్ల ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్‌లు కట్టుకుని మైదానానికి వచ్చారు. ఈ సమాచారాన్ని జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఆటగాళ్లకు అందించారు. ప్యాట్ కమిన్స్ తల్లి మారియా బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించారు.

విచారం వ్యక్తం చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా..

పాట్ కమిన్స్ తల్లి మృతి పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బోర్డు తన ప్రకటనలో కమ్మిన్స్‌ తల్లి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘ఆస్ట్రేలియన్ క్రికెట్ తరపున, పాట్ కమిన్స్ కుటుంబానికి మా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాం, ప్యాట్ కమిన్స్ తల్లికి గౌరవం ఇవ్వడానికి ఈ రోజు నల్లటి బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి రానున్నాం’ అంటూ ప్రకటించింది.

సిరీస్‌ మధ్యలోనే ఆస్ట్రేలియా వెళ్లిన కమిన్స్..

నాగ్‌పూర్, ఢిల్లీలో ఆడిన 2 టెస్టులకు పాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడో టెస్టుకు ముందు అతని తల్లి ఆరోగ్యం మరింత విషమించింది. అతను సిరీస్ నుంచి తప్పుకుని తన తల్లిని చూసుకోవడానికి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. అతని సారథ్యంలోని తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అదే సమయంలో ఇండోర్ టెస్టులో కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ సారథ్యం వహించి 9 వికెట్ల తేడాతో విజయం సాధించాడు.

ఇవి కూడా చదవండి

నాలుగో టెస్టు భారత్‌కు కీలకం..

అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు భారత్‌కు కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే.. అహ్మదాబాద్ టెస్టులో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే, భారత్ కనీసం 3-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకోవాలి. టీమ్‌ఇండియా ఈ పని చేయలేకపోతే ఫైనల్‌కు చేరుకోవడం కష్టమే. లేదంటే న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫలితాలపై టీమిండియా ఆధారపడవలసి ఉంటుంది.

వన్డే సిరస్‌కు కెప్టెన్‌గా స్టివ్ స్మిత్..

ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ప్రస్తుతం ఇండియాకు తిరిగి రావడం చాలా కష్టం. చివరి రెండు టెస్టులకు స్టివ్ స్మిత్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్‌కు కూడా స్మిత్ సారథ్యం వహించే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..