AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Awards: రోహిత్, హర్మన్ ప్రీత్‌లకు పద్మశ్రీ అవార్డులు.. క్రీడా రంగం నుంచి ఏకంగా 8మందికి..

దేశాభివృద్ధిలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే పద్మ పురస్కారాల్లో ఈ ఏడాది క్రీడాకారులకు పెద్దపీట వేశారు. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన రోహిత్ శర్మ, టెన్నిస్ కోర్టులో భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన విజయ్ అమృత్‌రాజ్‌లకు దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ లభించింది.

Padma Awards: రోహిత్, హర్మన్ ప్రీత్‌లకు పద్మశ్రీ అవార్డులు.. క్రీడా రంగం నుంచి ఏకంగా 8మందికి..
Rohit Sharma Harmanpreet Kaur
Venkata Chari
|

Updated on: Jan 25, 2026 | 6:30 PM

Share

2026 పద్మ పురస్కారాలలో భాగంగా విజయ్ అమృత్‌రాజ్ పద్మభూషణ్ అందుకున్నారు. అలాగే రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, ఇతర క్రీడాకారులు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

జనవరి 25, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్ లభించగా, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పురుషుల జట్టు సారథి రోహిత్ శర్మలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

ఈ ఏడాది క్రీడారంగం నుంచి పద్మభూషణ్ అందుకున్న ఏకైక వ్యక్తి విజయ్ అమృత్‌రాజ్ కావడం విశేషం. పద్మభూషణ్ అనేది భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం కాగా, పద్మశ్రీ నాల్గవ స్థానంలో ఉంటుంది. మాజీ టెన్నిస్ స్టార్ విజయ్ అమృత్‌రాజ్ భారత క్రీడారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా గతంలోనే పద్మశ్రీ (1983), అర్జున అవార్డు (1974) అందుకున్నారు.

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో పాటు భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్, మహిళల హాకీ జట్టు గోల్ కీపర్ సవితా పునియా కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితో పాటు బలదేవ్ సింగ్, భగవాన్ దాస్ రైక్వార్ మరియు కె. పజనివెల్‌లు కూడా క్రీడారంగంలో సాధించిన విజయాలకు గాను ఈ గౌరవాన్ని పొందారు.

పద్మ పురస్కారాలు 2026 అందుకున్న క్రీడాకారులు

విజయ్ అమృత్‌రాజ్ – పద్మభూషణ్

బలదేవ్ సింగ్ – పద్మశ్రీ

భగవాన్ దాస్ రైక్వార్ – పద్మశ్రీ

హర్మన్‌ప్రీత్ కౌర్ భుల్లర్ – పద్మశ్రీ

కె. పజనివెల్ – పద్మశ్రీ

ప్రవీణ్ కుమార్ – పద్మశ్రీ

రోహిత్ శర్మ – పద్మశ్రీ

సవితా పునియా – పద్మశ్రీ

Follow Us