AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NA 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

India vs New Zealand, 3rd T20I: మూడో టీ20లో భాగంగా టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. రవి బిష్ణోయ్ కూడా లక్కీ ఛాన్స్ దక్కింది.

IND vs NA 3rd T20I: టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
Ind Vs Nz 3rd T20
Venkata Chari
|

Updated on: Jan 25, 2026 | 6:40 PM

Share

India vs New Zealand, 3rd T20I: గువాహటిలోని బర్సపర స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు. అర్ష్‌దీప్ సింగ్,  వరుణ్ చక్రవర్తి ఆడటం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చాడు. రవి బిష్ణోయ్‌కి కూడా అవకాశం ఇచ్చారు.

సిరీస్‌లో టీం ఇండియా 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో మ్యాచ్‌లో విజయం సాధిస్తే న్యూజిలాండ్ వరుసగా ఐదవ T20I సిరీస్ విజయాన్ని సాధిస్తుంది. మునుపటి రెండు మ్యాచ్‌లలో 400 పరుగులకు పైగా స్కోర్లు నమోదయ్యాయి. మూడు ఇన్నింగ్స్‌లు 200 దాటాయి. గౌహతిలో కూడా అత్యధిక స్కోరింగ్ మ్యాచ్ జరగనుంది.

ఇరు జట్లు:

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జామిసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.