AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: టెస్ట్ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్.. పరీక్షగా మారిన వన్డే సిరీస్..

దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోల్పోయిన తర్వాత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు...

KL Rahul: టెస్ట్ కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్.. పరీక్షగా మారిన వన్డే సిరీస్..
Kl Rahul
Srinivas Chekkilla
|

Updated on: Jan 22, 2022 | 5:21 PM

Share

దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ కోల్పోయిన తర్వాత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెస్ట్ జట్టు కెప్టెన్సీకి వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. దీని తర్వాత భారత టెస్టు జట్టు తదుపరి కెప్టెన్ కోసం అన్వేషణ మొదలైంది. కెప్టెన్ రేసులో రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తుంది.

విరాట్ కోహ్లీ గాయం అవడంతో జోహన్నెస్‌బర్గ్‌లో రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు జరగగా, రెండింటిలోనూ భారత్ ఓడిపోయింది. దక్షిణాఫ్రికా టూర్‌లో చూస్తే, రాహుల్ మొత్తం మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, అన్నింటిలోనూ ఓటమిని ఎదుర్కొన్నాడు. వన్డే సిరీస్ ఓటమి తర్వాత, అతని కెప్టెన్సీపై చాలా విమర్శలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ సారథ్యంలో సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికాలో తొలి టెస్టు సిరీస్‌ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టిస్తుందని అంతా భావించారు. రెండో మ్యాచ్‌లో కోహ్లీకి వెన్ను నొప్పి రావడంతో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రోహిత్ శర్మ లేకపోవడంతో అతను ఈ కెప్టెన్సీని చేయాల్సి వచ్చింది. గత ఏడాది డిసెంబర్‌లో రోహిత్‌ను భారత టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా, ODI-T20 జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. రాహుల్‌కు పరిమిత ఓవర్లలో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. గాయం కారణంగా రోహిత్ ఈ పర్యటనకు రాలేకపోయాడు. అందుకే ఆ బాధ్యత రాహుల్ తలపైకి వచ్చింది. అతడు కెప్టెన్సీలో విఫలమయ్యాడు.

రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని భావించినప్పటికీ నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు వికెట్లు తీయలేకపోవడంతో ఇండియా ఓడిపోయింది. వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా భారత్ టెస్టుకు పరిహారం చెల్లిస్తుందని అందరూ భావించారు. కానీ రాహుల్ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్.. ఆ తర్వాత శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో కూడా ఓటమి పాలయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా దూకుడు ప్రదర్శించలేదు.

Read Also.. MD Dhoni: రైతుగా మారిన ఎంఎస్ ధోనీ.. ఏం పండించాడో తెలుసా..