AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Indians: విండీస్ స్టార్‌ ప్లేయర్‌పై వేటేసిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2023 బరిలో నిలిచేది వీరేనా?

Kieron Pollard: ముంబై ఇండియన్స్ తమ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను చేర్చుకుంది. అదే సమయంలో కీరన్ పొలార్డ్‌ను విడుదల చేసింది.

Mumbai Indians: విండీస్ స్టార్‌ ప్లేయర్‌పై వేటేసిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ 2023 బరిలో నిలిచేది వీరేనా?
2013లో ముంబై ఇండియన్స్ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సంవత్సరం గ్లెన్ మాక్స్‌వెల్‌ను రూ. 6.3 కోట్ల ధర చెల్లించి జట్టులో చేర్చుకుంది. ఆ ఏడాది వేలంలో మాక్స్‌వెల్ అత్యంత ఖరీదైనవాడిగా నిలిచాడు. ఆ సంవత్సరం ముంబైని ఛాంపియన్‌గా మార్చడంలో మాక్స్‌వెల్ ప్రత్యేక సహకారం అందించలేదు. ఏటా అత్యంత ఖరీదైన ఆటగాళ్లను కొనుగోలు చేసే జట్ల పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Venkata Chari
|

Updated on: Nov 14, 2022 | 6:55 PM

Share

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ జట్టు 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. IPL 2023 వేలంలో ముంబై ఇండియన్స్ తమ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను చేర్చుకుంది. అయితే, రోహిత్ శర్మ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నుంచి జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను ట్రేడింగ్ చేసింది. అయితే, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌లో భాగంగానే ఉన్నాడు.

ముంబై ఇండియన్స్ జెర్సీలో జాసన్ బెహ్రెండార్ఫ్..

ఐపీఎల్ మెగా వేలం 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. మరోవైపు, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. IPL మెగా వేలం 2018లో ముంబై ఇండియన్స్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020 వరకు ముంబై ఇండియన్స్‌లో భాగంగానే ఉన్నాడు. ఇప్పుడు మరోసారి ఈ ఆటగాడు ముంబై ఇండియన్స్ జెర్సీలో కనిపించనున్నాడు.

అదే సమయంలో, మీడియా నివేదికల ప్రకారం, ముంబై ఇండియన్స్ కరోన్ పొలార్డ్‌ను విడుదల చేసింది. ముంబై ఇండియన్స్ తరపున కీరన్ పొలార్డ్ 2010 నుంచి బరిలో నిలుస్తున్నాడు. ఈ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ముంబై ఇండియన్స్ విజయంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాడు. కానీ, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఈ ఆటగాడిని విడుదల చేయాలని నిర్ణయించుకుంది. కీరన్ పొలార్డ్ ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఈ ఆటగాడు ముంబై ఇండియన్స్ తరపున 189 మ్యాచ్‌లు ఆడాడు. ముంబై ఇండియన్స్ తరపున కీరన్ పొలార్డ్ 28.67 సగటుతో 3412 పరుగులు చేశాడు. ఈ సమయంలో స్ట్రైక్ రేట్ 147.32తో పరుగులు చేశాడు. అలాగే పొలార్డ్ అత్యుత్తమ స్కోరు 87గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరపున భాగమైన ఆటగాళ్లు వీరే..

రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..