Team India: 25 ఏళ్ల ప్రతీకారాన్ని మడతెట్టేసిన జడేజా విన్నింగ్ షాట్.. నిన్నటి మ్యాచ్లో ఇవి గమనించారా?
252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ చెప్పిన దాని ప్రకారం ఆడాడు. క్రీజు నుంచి బయటకు వచ్చి స్ట్రోక్స్, చక్కని పికప్, అద్భుతమైన కవర్ డ్రైవ్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో కొన్ని ఆహ్లాదకరమైన స్ట్రోక్స్లతో అలరించాడు. రోహిత్ ఎక్కువ స్ట్రైక్ను ఫామ్ చేస్తూ, ఎక్కువ పరుగులు వేగంగా చేయడంతో మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ మరొక ఎండ్ నుంచి నెమ్మదించాడు.

India vs New Zealand: రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే, ఒక్కసారిగా స్టేడియంతోపాటు దేశ వ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచిన వేళ.. రోహిత్ సేన దేశానికి, ఫ్యాన్స్కు అంకితమిచ్చి అందరిలో సంతోషాన్ని నింపారు. ఇక క్రీజులో మరో ఎండ్లో నిలిచిన కేఎల్ రాహుల్ తన చేతులను పైకెత్తి వేడుకలను ప్రారంభించాడు. ఆ వెంటనే హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ మొదటగా మైదానంలోకి పరిగెత్తారు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ వచ్చారు. మరోవైపు సీనియర్ ఆటగాళ్ళు డగౌట్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి సంబరాలు చేసుకున్నారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అజేయంగా నిలిచిన భారత్, మరో ఓవర్ మిగిలి ఉండగానే తన లక్ష్యాన్ని ముగించడంతో బాణసంచాల పేలుళ్లు మొదలయ్యాయి. అనంతరం ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలను ధరించి, “లెహ్రా దో”, “చక్ దే ఇండియా” పాటలకు అనుగుణంగా నినాదాలు చేశారు. టార్గెట్ కష్టమైనదేమీ కాదు.. పిచ్ మందకోడిగా ఉండడంతో భారత విజయానికి కొన్ని ఆటుపోట్లు తప్పలేదు.
JADEJA FINISHES OFF IN STYLE! 🇮🇳
TEAM INDIA WIN THE CHAMPIONS TROPHY 2025 🏆#ChampionsTrophyOnJioStar #INDvNZ #ChampionsTrophy pic.twitter.com/ismVCQQndD
— Star Sports (@StarSportsIndia) March 9, 2025
ముందు రెండు ఓవర్లలో జీరోగా నమోదవ్వడంతో.. రోహిత్ శర్మ 27వ ఓవర్లో రచిన్ రవీంద్రపై భారీ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ, క్రీజు నుంచి ముందుకు వచ్చిన రోహిత్ను కీపర్ స్టంప్ ఔట్ చేశాడు. దీంతో 83 బంతుల్లో 76 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా పిన్-డ్రాప్ సైలెన్స్ కనిపించింది.
పెవిలియన్ చేరే క్రమంలో ఎక్కువ భాగం రోహిత్ తల వంచుకుని ఉన్నాడు. స్టాండ్స్లో ఉన్న వేలాది మంది నమ్మకాన్ని నిజం చేయలేకపోయామనే బాధ కనిపించింది. ఈ క్రమంలో 105/0 నుంచి భారత జట్టు 122/3కి పడిపోయింది. వేగంగా వికెట్లు న్యూజిలాండ్ బౌలర్లకు దక్కడంతో.. ఆటలోకి తిరిగి వచ్చింది.
One Team One Dream One Emotion!
🇮🇳🇮🇳🇮🇳#TeamIndia pic.twitter.com/MbqZi9VGoG
— BCCI (@BCCI) March 9, 2025
252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ చెప్పిన దాని ప్రకారం ఆడాడు. క్రీజు నుంచి బయటకు వచ్చి స్ట్రోక్స్, చక్కని పికప్, అద్భుతమైన కవర్ డ్రైవ్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ సమయంలో కొన్ని ఆహ్లాదకరమైన స్ట్రోక్స్లతో అలరించాడు. రోహిత్ ఎక్కువ స్ట్రైక్ను ఫామ్ చేస్తూ, ఎక్కువ పరుగులు వేగంగా చేయడంతో మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ మరొక ఎండ్ నుంచి నెమ్మదించాడు.
గత రెండు సంవత్సరాలుగా రోహిత్ అనుసరిస్తున్న విధానం ఇదే. కానీ ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో స్పిన్తో పోలిస్తే పరుగులు సాధించడం కష్టంగా ఉన్నప్పుడు అతను గేర్ మార్చుకుని బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించిన అరుదైన సందర్భం ప్రేక్షకులు చూశారు. మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్వెల్, రచిన్ రవీంద్ర వంటి స్పిన్నర్లు ఉన్నా.. భారత బ్యాటర్లు ధీటుగా ఎదుర్కొని అద్భుత విజయాన్ని నమోదు చేశారు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India’s epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025
శ్రేయాస్ అయ్యర్ అక్షర్ పటేల్తో కలిసి కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి, పరుగుల వేగాన్ని పెంచారు. ముఖ్యంగా అయ్యర్ స్పిన్తో పోలిస్తే తన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తదుపరి డెలివరీలో లైఫ్ పొందే ముందు భారీ సిక్స్ కూడా కొట్టాడు.
పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ, అయ్యర్ తన 62 బంతుల్లో 48 పరుగులతో మిడిల్ ఆర్డర్లో ఆకట్టుకున్నాడు. అయ్యర్ ఔటైన తర్వాత భారత్ విజయానికి మరో 69 పరుగులు చేయాల్సి ఉంది. కానీ, చేతిలో తగినంత వికెట్లు ఉండడంతో.. రాహుల్ మరో చూడ చక్కని ఇన్నింగ్స్తో టార్గెట్ పూర్తి చేశాడు. మెన్ ఇన్ బ్లూ చేతిలో నాలుగు వికెట్లు ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత్ ఖాతాలో మూడవ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ చేరింది.
సంక్షిప్త స్కోర్లు:
న్యూజిలాండ్ : 50 ఓవర్లలో 251/7 (డారిల్ మిచెల్ 63, మైఖేల్ బ్రేస్వెల్ 53 నాటౌట్, రాచిన్ రవీంద్ర 37; కుల్దీప్ యాదవ్ 2/40, వరుణ్ చక్రవర్తి 2/45.
భారత జట్టు : 49 ఓవర్లలో 254/6 (రోహిత్ శర్మ 76, శ్రేయాస్ అయ్యర్ 48; మిచెల్ సాంట్నర్ 2/46, మైఖేల్ బ్రేస్వెల్ 2/28).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..