Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ Final: మా గెలుపుకి వారే కారణం! రాహుల్, హార్దిక్ లు కాదు భయ్యో.. రోహిత్ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడంటే?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ గెలుపును స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ ఇచ్చాడు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జడేజా కీలక బ్రేక్‌త్రూ ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించారు. రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్ గెలుచుకోవడంతో భారత క్రికెట్ చరిత్రలో మరో గొప్ప ఘట్టం లిఖించబడింది!

IND vs NZ Final: మా గెలుపుకి వారే కారణం! రాహుల్, హార్దిక్ లు కాదు భయ్యో.. రోహిత్ క్రెడిట్ ఎవరికి ఇచ్చాడంటే?
Rohit Sharma On Final Match
Follow us
Narsimha

|

Updated on: Mar 10, 2025 | 9:55 AM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనకు క్రెడిట్ ఇచ్చాడు. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడం విశేషం. కెప్టెన్‌గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్‌ను అందుకోవడం మరో మైలురాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. మైదానానికి వచ్చి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మా ఆటను చూసేందుకు వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. ఇది మా హోమ్ గ్రౌండ్ కాదు. కానీ ప్రేక్షకులు మాకు అందించిన మద్దతుతో నిజంగా అది హోమ్ గ్రౌండ్‌లా మారిపోయింది. వారంతా సంతోషించేలా గెలిచినందుకు ఆనందంగా ఉంది’’ అని రోహిత్ పేర్కొన్నాడు.

ఈ విజయానికి ప్రధాన కారణం మా స్పిన్నర్లే అని చెప్పిన రోహిత్, ‘‘ఈ ఒక్క మ్యాచే కాదు, టోర్నీ మొత్తం మా స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టర్నింగ్ పిచ్‌లపై స్పిన్నర్లపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే, మా బౌలర్లు ఏమాత్రం నిరాశపరచలేదు. మా స్పిన్నర్ల బలాన్ని అర్థం చేసుకుని, దాన్ని మెరుగైన విధంగా వినియోగించుకున్నాం. టోర్నమెంట్ మొత్తం మా బౌలింగ్ యూనిట్ నిలకడగా రాణించింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ మెరుగైన ప్రదర్శనతో మ్యాచ్‌ను మాపై ఒగ్గారు’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

‘‘వరుణ్ చక్రవర్తిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇలాంటి పిచ్‌లపై అతను బ్యాటర్లకు తీవ్ర ముప్పుగా మారుతాడు. అతని డెలివరీలు అర్థం చేసుకునే లోపే బ్యాటర్లు ఔటైపోతారు. ఆ ఆలోచనతోనే అతన్ని జట్టులోకి తీసుకున్నాం. టోర్నమెంట్ ఆరంభంలో అతనికి అవకాశం ఇవ్వలేదు. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 5 వికెట్లు తీయగానే, అతని సామర్థ్యం మాకు పూర్తిగా అర్థమైంది. ఆ ప్రదర్శనతోనే అతన్ని జట్టులో కొనసాగించాం. అతని బౌలింగ్‌లో గొప్ప క్వాలిటీ ఉంది. అదృష్టవశాత్తు అది మాకు పెద్ద ప్రయోజనం కలిగించింది’’ అని రోహిత్ వివరించాడు.

ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్), డారిల్ మిచెల్ (101 బంతుల్లో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (2/45), కుల్దీప్ యాదవ్ (2/40) రెండేసి వికెట్లు తీసి కీలకమైన బ్రేక్‌త్రూ ఇచ్చారు. మహమ్మద్ షమీ (1/74), రవీంద్ర జడేజా (1/30) తలో వికెట్ పడగొట్టారు.

252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ 76 (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో) శతకాన్ని చేజార్చుకోగా, శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48) హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. చివర్లో కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్) ఒత్తిడిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్‌వెల్ (2/28) రెండేసి వికెట్లు తీయగా, రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టారు. అయితే, భారత బ్యాటింగ్ లైనప్ గట్టిగా నిలబడటంతో, ఈ బౌలింగ్ తిప్పలు కలిగించలేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..