AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs England : నేటి టెస్టు మ్యాచ్ కు పొంచి ఉన్న వరుణ గండం.. మరి ఆట సంగతేంటి ?

మాంచెస్టర్‌లోని నాలుగో టెస్ట్ రెండో రోజున వర్షం పడే అవకాశం ఉంది, ఇది టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. మొదటి రోజు భారత్ 264/4 పరుగులు చేసింది. నేటి వాతావరణ నివేదిక ముఖ్యంగా మూడు సెషన్లలో వర్షం అంచనాలు ఆటపై దాని ప్రభావం గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

India vs England : నేటి టెస్టు మ్యాచ్ కు పొంచి ఉన్న వరుణ గండం.. మరి ఆట సంగతేంటి ?
India Vs England
Rakesh
|

Updated on: Jul 24, 2025 | 2:31 PM

Share

India vs England : భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో నేడు రెండో రోజు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. రిషబ్ పంత్ కాలికి బంతి తగిలి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్(58), సాయి సుదర్శన్ (61) హాఫ్ సెంచరీలు చేశారు. నేడు మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. మూడు సెషన్లకు సంబంధించిన వాతావరణ నివేదిక ఎలా ఉందో తెలుసుకుందాం. ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్‌ను డ్రా చేసుకున్నా హ్యాపీనే. ఎందుకంటే వారికి సిరీస్‌లో 2-1 ఆధిక్యం ఉంది. ఒకవేళ ఈ టెస్ట్ డ్రా అయితే, బెన్ స్టోక్స్ జట్టుకు సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. అప్పుడు శుభ్‌మన్ గిల్ జట్టు చివరి టెస్ట్ గెలిచినా సిరీస్‌ను సమం చేయగలుగుతుంది. కాబట్టి, నాలుగో టెస్ట్‌లో వర్షం వస్తే టీమిండియాకే ఎక్కువ నష్టం.

అక్యూవెదర్ వాతావరణ నివేదిక ప్రకారం, నేడు మాంచెస్టర్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వర్షం పడే అవకాశం 20 శాతం ఉంది. ఇది మొదటి సెషన్ సమయం. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. మొదటి సెషన్‌లో వర్షం పడే అవకాశం తక్కువ ఉన్నప్పటికీ, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రెండో సెషన్ చివరి 5 ఓవర్ల సమయంలో వర్షం పడవచ్చు. రెండో సెషన్‌లో ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండవచ్చు. ఇది బ్యాటింగ్ చేయడానికి మంచి సమయం అని అంచనా.

మూడో సెషన్ బౌలర్లకు అనుకూలంగా ఉండవచ్చు. ఈ సెషన్‌లో వర్షం పడే అవకాశం 50 శాతం ఉంది. మూడో సెషన్ వర్షం వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలా జరిగితే, కొన్ని ఓవర్ల మ్యాచ్ జరిగినా బ్యాట్స్‌మెన్‌లకు సవాలుగా ఉంటుంది. ఈ సెషన్‌లో కూడా ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉంటుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్షం కారణంగా నేడు తక్కువ ఓవర్ల ఆట జరగాలని భారత జట్టు కోరుకోదు. రెండో రోజు భారత్ ఇన్నింగ్స్‌ను రవీంద్ర జడేజా(19*), శార్దూల్ ఠాకూర్(19) కొనసాగిస్తారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కనీసం 400 పరుగులు చేయాలని కోరుకుంటుంది.

భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ లైవ్ ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జరుగుతోంది. లైవ్ స్ట్రీమింగ్ జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
పెళ్లింట తీరని విషాదం.. తల్లి, కూతురు ఆత్మహత్య
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
బాబోయ్‌ భయంకరం.. వ్యక్తిని బంతిలా గాలిలోకి ఎగరేసి, కాళ్లతో తొక్కి
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
పెళ్లి చేసుకునే వారికి కొత్త టెన్షన్.. వాటితో సంబంధం లేదంటున్న
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
డీమార్ట్ బంపర్ ఆఫర్.. ఇండక్షన్ స్టవ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు..
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
ఈ కూరగాయలతో గిన్నెలు తోమండి… జిడ్డు పోయి మెరిసిపోవడం పక్కా
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
గంభీర్ కు 2027 వన్డే ప్రపంచకప్పే అసలైన అగ్నిపరీక్ష : గంగూలీ
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత
ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. నిమిషం నిబంధన ఎత్తివేత