టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న భారత జట్టు గురువారం (జులై 04) సాయంత్రం ముంబైలో ఓపెన్ బస్సులో రోడ్ షో నిర్వహించింది . ఈ సందర్భంగా అశేష జనవాహిని మధ్య రోహిత్ బృందం రోడ్ షో సాగింది. నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ఊరేగింపు సాగగా, దారిలో తమ అభిమాన ఆటగాళ్లను చూసి అభిమానులు సంబురాలు చేసుకున్నారు. భారత క్రికెటర్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో అభిమానులకకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. లక్షలాది మంది జనం మధ్యలో కప్పు పట్టుకుని రోహిత్ బృందం డ్యాన్సులు చేసింది. రోహిత్ రోడ్ షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా ఓపెన్ బస్సులో రోడ్ షో నిర్వహించింది. ఆ వేడుకల తర్వాత మళ్లీ సుమారు 17 ఏళ్లకు టీ20 ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. దీంతో దేశంలో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
విజయోత్సవ ఊరేగింపు అనంతరం వాంఖడే స్టేడియంలోకి టీమిండియా ప్రవేశించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్లంతా వణుకు ప్రారంభించారు.
125 CRORES FOR INDIAN TEAM. 🤯🔥 pic.twitter.com/447yKQuynS
— Johns. (@CricCrazyJohns) July 4, 2024
కాగా ముంబై రోడ్లపై ఓపెన్ టాప్ బస్సులో రోహిత్ సేన విక్టరీ పరేడ్ కన్నుల పండువగా సాగుతోంది. వాంఖడే స్టేడియానికి చేరుకున్నాక అక్కడ భారత క్రికెట్ బోర్డు వరల్డ్ కప్ విజేతలను ఘనంగా సత్కరించనుంది. అలాగే రూ. 125 కోట్ల నజరానాను భారత ప్లేయర్లకు అందజేయనుంది.
#WATCH | Rohit Sharma and Virat Kohli lift the #T20WorldCup2024 trophy and show it to the fans who have gathered to see them hold their victory parade, in Mumbai. pic.twitter.com/jJsgeYhBnw
— ANI (@ANI) July 4, 2024
BCCI office bearers present Team India with a cheque of Rs 125 Crores, at Wankhede Stadium in Mumbai.
The BCCI announced a prize money of Rs 125 crores for India after the #T20WorldCup pic.twitter.com/YFUj0nIggh
— ANI (@ANI) July 4, 2024
#WATCH | Team India greets fans as it conducts their victory parade in Mumbai.#T20WorldCup2024 pic.twitter.com/zG4rWVdJHS
— ANI (@ANI) July 4, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..