AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: 6,6,6,6,6,6,4,4,4,…. 27 ఫోర్లు, 7 సిక్సర్లతో కంగారులనే కంగారు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్.. గుర్తుందా?

టీమిండియా తరఫున మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 27 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటికే ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగిందో మీకు అర్థం అయి ఉంటాది..

Shreyas Iyer: 6,6,6,6,6,6,4,4,4,…. 27 ఫోర్లు, 7 సిక్సర్లతో కంగారులనే కంగారు పెట్టించిన శ్రేయాస్ అయ్యర్.. గుర్తుందా?
Shreyas Iyer
Velpula Bharath Rao
|

Updated on: Dec 05, 2024 | 6:08 PM

Share

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా తొలి మ్యాచ్‌లో విజయం సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అద్భుతంగా ప్రారంభించింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇప్పుడు రెండో మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. టీమిండియా తరఫున మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్.. ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు బాది కంగారూ బౌలర్లపై దాడి చేశాడు. 2017లో ఇండియా ఎ, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది, అందులో శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా ఉంది. ఈ ఇన్నింగ్స్‌లో, శ్రేయాస్ అయ్యర్ కంగారూ బౌలర్లను చిత్తు చేశాడు. 27 ఫోర్లు, 7 సిక్సర్లతో డబుల్ సెంచరీ చేశాడు. 210 బంతులు ఎదుర్కొని 202 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ పర్యటనలో కొత్త ఆటగాళ్లను భారతదేశం ఏ కి పంపింది. అయితే చాలా మంది పెద్ద పేర్లు ఆస్ట్రేలియా జట్టులో  ఉన్నారు. కానీ శ్రేయాస్ అయ్యర్ ఊచకోతకుఆస్ట్రేలియా బౌలర్లు కూడా పోటీ పడలేకపోయారు.  ప్రతి ఆసీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ తన ఇన్నింగ్స్ సమయంలో 306 నిమిషాల పాటు మైదానంలో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు.  అతను 2024లో శ్రీలంకతో తన చివరి మ్యాచ్ ఆడాడు. గతేడాది కూడా బీసీసీఐ అతడిని వార్షిక కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే దీని తర్వాత అతను రంజీలో అద్భుత ప్రదర్శనతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. త్వరలో అతను టీమ్ ఇండియాలో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ INR 26.75 కోట్ల భారీ ధరతో పంజాబ్ కింగ్స్ (PBKS)కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో ముంబైకి వ్యతిరేకంగా గోవాపై సెంచరీ చేసిన తర్వాత శ్రేయాస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 57 బంతుల్లో 11 ఫోర్లు మరియు 10 సిక్సర్ల సహాయంతో 130 పరుగులు చేశాడు. అతని ధాటికి ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇది చదవండి: ఇది భయ్యా! నీ అసలు రూపం..రుతురాజ్ కా ‘హుకూం’.. టీ20ల్లో ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి