AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup: 6 వన్డేలే ఆడాడు.. కట్‌చేస్తే.. 3 రోజుల ముందు స్వ్కాడ్‌లో చేరాడు.. కీలక మార్పు ఎందుకంటే?

Team Change: రాబోయే ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంక దేశాల్లో జరగనుంది. ఈ కాంటినెంటల్ క్రికెట్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి మొదలుకానుంది. వన్డే ప్రపంచకప్ 2023 దగ్గర్లో ఉండడంతో ఆసియాకప్ ఈసారి వన్డే ఫార్మాట్‌లో జరుగుతుంది. టోర్నీ ప్రారంభానికి 3 రోజుల ముందు జట్టులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Asia Cup: 6 వన్డేలే ఆడాడు.. కట్‌చేస్తే.. 3 రోజుల ముందు స్వ్కాడ్‌లో చేరాడు.. కీలక మార్పు ఎందుకంటే?
Asia Cup 2023 Teams
Venkata Chari
|

Updated on: Aug 27, 2023 | 1:50 PM

Share

Team Change for Asia Cup 2023: ఆసియా కప్ ప్రారంభం కావడానికి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కాంటినెంటల్ క్రికెట్ టోర్నమెంట్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, శ్రీలంకలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, అన్ని జట్లు ఇందుకోసం కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పు చేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

27 ఏళ్ల ఆటగాడికి జట్టులో చోటు..

ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టులో చివరి నిమిషంలో మార్పులు చేసింది. పాకిస్థాన్ తన జట్టులో అదనపు ఆటగాడిని చేర్చుకుంది. సెప్టెంబరు 5న 28 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ 17 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ తయ్యబ్ తాహిర్ ట్రావెలింగ్ రిజర్వ్‌గా జట్టుతో కలిసి ఉంటాడు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ప్రకటించిన పీసీబీ..

ఇప్పటి వరకు 6 వన్డేలు మాత్రమే ఆడాడు..

సౌద్ షకీల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 6 వన్డేలు మాత్రమే ఆడాడు. అతను ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ (PAK vs AFG) కోసం పాక్ జట్టుతో కూడా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని మూడో, ఆఖరి వన్డేలో అతనికి అవకాశం ఇచ్చారు. కానీ 9 పరుగులు మాత్రమే చేశాడు. సౌద్ ఇప్పటివరకు 6 ODIల్లో ఒక అర్ధ సెంచరీతో కేవలం 19 సగటుతో 76 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇది కాకుండా, అతను 7 టెస్టుల్లో 2 సెంచరీలు, 6 అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 875 పరుగులు చేశాడు. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ కూడా సాధించాడు.

ఆగస్ట్ 27న ముల్తాన్..

పీసీబీ నివేదిక ప్రకారం, బాబర్ అజామ్ సారథ్యంలోని జట్టు ఆగస్ట్ 27, ఆదివారం ముల్తాన్ చేరుకుంటుంది. మరుసటి రోజు అంటే సోమవారం విశ్రాంతి తీసుకుంటుంది. లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో పాల్గొన్న ఆటగాళ్లకు టీమ్ మేనేజ్‌మెంట్ మినహాయింపు ఇచ్చింది. బాబర్‌తో పాటు ఇమామ్-ఉల్-హక్, నసీమ్ షా ఆదివారం లాహోర్ వెళ్లి సోమవారం సాయంత్రం జట్టులో చేరనున్నారు. ఆటగాళ్లందరూ ఆగస్టు 29 మంగళవారం ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో శిక్షణ పొందుతారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఆగస్టు 30న ముల్తాన్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఆ తరువాత, సెప్టెంబర్ 2 న, భారత్ వర్సెస్ పాకిస్తాన్ (IND vs PAK) మధ్య ఎంతో ఆసక్తికర పోరు జరగనుంది.

పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్. ట్రావెల్ రిజర్వ్: తయ్యబ్ తాహిర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..