AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‎లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును శుక్రవారం ప్రకటించింది...

Virat Kohli: కోహ్లీ పేరు పక్కన C(కెప్టెన్) లేకపోవడం ఇబ్బందిగా ఉంది.. మాజీ ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు..
Virat
Srinivas Chekkilla
|

Updated on: Jan 01, 2022 | 7:06 PM

Share

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జనవరి 19 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‎లో ODI సిరీస్ కోసం 18 మంది సభ్యులతో భారత జట్టును శుక్రవారం ప్రకటించింది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోకపోవటంతో అతడి స్థానంలో KL రాహుల్ కెప్టెన్‎గా ఎంపిక చేశారు. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జట్టు ఎంపికపై భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. భారత జట్టులో కోహ్లీ పేరు పక్కన “సి” (కెప్టెన్) లేకపోవడం తనకు “నిజంగా ఇబ్బందిగా” అనిపించిందని చోప్రా అన్నాడు.

“విరాట్ కోహ్లి పేరు తర్వాత ‘సి’ లేదు. అది నిజంగా ఇబ్బందికరంగా అనిపించింది. ఎందుకంటే కొన్నేళ్లుగా అది జరగడం లేదు” అని తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో చెప్పాడు. “ఇటీవల టీ20 సిరీస్‌లో మేము చూశాము. కోహ్లీ ఆటను వీడడానికి కొంత సమయం పడుతుంది. కానీ విరాట్ ఇప్పుడు కెప్టెన్ కాదు” అని చెప్పాడు. ఈ ఏడాది ప్రారంభంలో UAEలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. వరల్డ్ కప్ ముందే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పిన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‎గా ఎంపిక చేశారు. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించారు.

Read Also.. IND vs SA: వాండరర్స్‌లో చెమటోడ్చిన భారత ఆటగాళ్లు.. వైరల్‎ అయిన వీడియో..