AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: పట్టుబట్టి మరీ ఐసీసీని దారిలోకి తెచ్చుకున్న బీసీసీఐ.. మారిన ఐపీఎల్ షెడ్యూల్..

ICC: ఐపీఎల్ మీడియా హక్కుల వేలం సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జైషా ఐపీఎల్ విండోను విస్తరించేందుకు ఐసీసీతో మాట్లాడతానని చెప్పిన సంగతి తెలిసిందే.

IPL 2023: పట్టుబట్టి మరీ ఐసీసీని దారిలోకి తెచ్చుకున్న బీసీసీఐ.. మారిన ఐపీఎల్ షెడ్యూల్..
Ipl 2023
Venkata Chari
|

Updated on: Jul 16, 2022 | 6:31 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది నుంచి విస్తరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022 (IPL 2022)లో ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొన్నాయి. కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకుంది. 10 జట్ల రాక కారణంగా, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు పెరిగిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) కార్యదర్శి జైషా తన వ్యూహాన్ని వ్యక్తం చేశారు. రెండున్నర నెలల విండోను పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. IPL కోసం ICCతో మాట్లాడతానంటూ పేర్కొన్నాడు. దీనిని BCCI అంగీకరించింది. మరింత మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడేందుకు వీలుగా IPL తన పరధిని విస్తరించుకోనుంది. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ రెండున్నర నెలల లీగ్‌గా జరగనుంది. దీనికి ఆమోదం లభించింది. IPL సాధారణంగా మార్చి చివరి వారంలో, ఏప్రిల్ ప్రారంభంలో జరుగుతుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2023 నుంచి మరో రెండు వారాలు రెండు వారాల పాటు పొడిగించారు.

మారిన ప్రణాళిక ఏంటంటే?

ICC కొత్త FTPని ప్రకటించింది. ఈ ఫార్మాట్ ESPNcricinfo వెబ్‌సైట్‌ అందించింది. ఈ వెబ్‌సైట్ తన నివేదికలో అంతర్జాతీయ క్రికెట్‌ను మే 2023, ఏప్రిల్ 2027 మధ్య ఆడాలని ఉంది. ఇది రెండు భాగాలుగా విభజించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్. అయితే వాటి మధ్య అంతరం అసలు కథను చెబుతుంది. ప్రతి సంవత్సరం మార్చి చివరి వారం, జూన్ మొదటి వారంలో IPL కోసం విండో ఉంటుందంట. దీంతో ఈకొత్త ముసాయిదా జైషా రెండు వారాల పొడిగింపును ధృవీకరించిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే నాలుగేళ్లలో, ఈ కాలంలో చాలా తక్కువ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఉండడం విశేషం.

ఇవి కూడా చదవండి

పెరిగిన మ్యాచ్‌ల సంఖ్య..

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఎనిమిది జట్లు ఆడుతుండగా, ఈసారి 10 జట్లు ఆడనున్నాయి. IPL 2022లో 10 జట్లు ఉన్నందున, మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించారు. వచ్చే ఐదేళ్లకు ఐపీఎల్ మీడియా హక్కులను బీసీసీఐ వేలం వేసింది. బీసీసీఐ మ్యాచ్‌ల సంఖ్యను ఇప్పటికే ప్రకటించింది. 2023, 24లో 74 మ్యాచ్‌లు ఆడనున్నట్టు బీసీసీఐ తెలిపింది. అదే సమయంలో, 2025, 26లో 84 మ్యాచ్‌లు జరుగుతాయి. 2027లో ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..