AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: కనక వర్షం కురిపించిన మార్క్యూ ప్లేయర్‌లు.. జాక్‌పాట్ కొట్టిన జాబితాలో ఎవరున్నారంటే?

ఐపీఎల్ 2022 (IPL 2022) వేలం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, కొందరికి భారీ బిడ్లు కూడా దాఖలయ్యాయి.

IPL 2022 Auction: కనక వర్షం కురిపించిన మార్క్యూ ప్లేయర్‌లు.. జాక్‌పాట్ కొట్టిన జాబితాలో ఎవరున్నారంటే?
Ipl Auction 2022 Marquee Players
Venkata Chari
|

Updated on: Feb 12, 2022 | 4:13 PM

Share

ఐపీఎల్ 2022 (IPL 2022) వేలం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా, కొందరికి భారీ బిడ్లు కూడా దాఖలయ్యాయి. 10 మంది ఆటగాళ్లు పాల్గొన్న మార్క్యూ ప్లేయర్ల వేలంతో ప్రారంభమైన ఈ వేలం.. ఏడుగురికి భారీ ప్రమోషన్ లభించింది. ఈ ఆటగాళ్లపై చాలా జట్లు ఆసక్తి కనబరిచాయి. భారత స్టార్ ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మార్క్యూ ప్లేయర్‌లలో అత్యంత ఖరీదైన వ్యక్తిగా నిలిచాడు. అతడితో పాటు ఆటగాళ్లకు కూడా భారీ మొత్తమే దక్కింది.

ముందుగా వేలం వేసిన మార్క్యూ ప్లేయర్లలలో అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన వారున్నారు. చాలా జట్లు వారిని కొనుగోలు చేయాలనుకున్నాయి. ఈసారి భారత్‌కు చెందిన శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డు ప్లెసిస్, క్వింటన్ డి కాక్, గిసో రబాడ, ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్‌లతో సహా 10 మంది ఆటగాళ్లను మార్క్యూ ప్లేయర్‌లుగా ఎంపిక చేశారు.

ఈ ఆటగాళ్లు లాభపడ్డారు..

శ్రేయాస్ అయ్యర్ – రూ. 12.25 కోట్లు (KKR).. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు భారీ బిడ్ వస్తుందని ముందునుంచి భావించిన సంగతి తెలిసిందే. గతేడాది ఢిల్లీ జట్టు అతడిని రూ.7 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం కేకేఆర్ అతడిని రూ.12.25 కోట్లకు చేర్చుకుంది. దీంతో అయ్యర్‌కి భారీ ప్రయోజనం చేకూరింది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ సారథిగాను ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.

కగిసో రబడ – రూ. 9.25 కోట్లు (PBKS).. కగిసో రబాడను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అతను గత కొన్ని సీజన్‌లుగా బాగా రాణిస్తున్నాడు. అయితే, ప్రస్తుతం అతడిని పంజాబ్ కింగ్స్ దాదాపు రెట్టింపు ధరకు కొనుగోలు చేసింది. రూ. 9.25 కోట్లకు రబాడను తనతో చేర్చుకుంది.

శిఖర్ ధావన్ – రూ. 8.25 కోట్లు (PBKS).. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన శిఖర్ ధావన్‌కు కూడా భారీ ప్రయోజనం దక్కింది. ఈసారి రూ.5.2 కోట్లకు కొనుగోలు చేశారు.

ట్రెంట్ బౌల్ట్ – రూ. 8 కోట్లు (RR).. ట్రెంట్ బౌల్ట్ గత కొన్ని సీజన్‌లుగా ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గతంలో ఎంఐ రూ. 3.2 కోట్లకు చేర్చుకుంది. అయితే ఈసారి మాత్రం భారీ పోటీ రావడంతో రాజస్థాన్ రాయల్స్ టీం రూ.3.2 కోట్లకు జట్టులోకి తీసుకుంది.

ఫాఫ్ డు ప్లెసిస్ – రూ.7 కోట్లు (RCB).. చెన్నై సూపర్ కింగ్స్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నమ్మకమైన ఫాఫ్ డు ప్లెసిస్ ఈసారి ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాడు. ప్రస్తుతం అతను RCB తరపున ఆడబోతున్నాడు. ఈ ఆటగాడిని గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రూ. 1.6 కోట్లకు దక్కించుకోగా, ఈ ఏడాది మాత్రం ఆర్‌సీబీ భారీ ధరతో దక్కించుకుంది.

క్వింటన్ డి కాక్ – రూ. 6.75 కోట్లు (LSG).. ఈ వేలంలో ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్‌కు కూడా భారీ ప్రయోజనం లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతన్ని రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబై తరపున కేవలం రూ. 2.8 కోట్లు మాత్రమే పొందిన డికాక్.. భారీ లాభంతో లక్నో టీంలో చేరాడు.

మహ్మద్ షమీ – రూ. 6.25 కోట్లు (GT).. పంజాబ్ కింగ్స్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకడు. అతన్ని జట్టు గతేదాడి రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుత వేలంలో రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Also Read: LSG IPL 2022 Auction: ఈ ఆటగాళ్లను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.. KL రాహుల్‌తోపాటు ఎవరున్నారో తెలుసుకోండి..

IPL Auction 2022: మిస్టర్ ఐపీఎల్‌కు షాకిచ్చిన ఫ్రాంచైజీలు.. అమ్ముడుపోని లిస్టులో ఎవరున్నారంటే?