AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్.. చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ

Jaiswal-Suryavanshi Duo : రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌ లో ఫాస్టెస్ట్ 500 పార్ట్‌నర్‌ షిప్ రికార్డును అందుకోనున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో వీరు కేవలం 3 పరుగులు చేస్తే సెహ్వాగ్-గంభీర్ రికార్డు బద్దలవుతుంది.

IPL 2026 :  సెహ్వాగ్-గంభీర్ రికార్డుకు ఎండ్ కార్డ్.. చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
Rajasthan Royals
Rakesh
|

Updated on: Apr 04, 2026 | 12:55 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2008లో మొట్టమొదటి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత మళ్ళీ కప్పు కొట్టకపోయినా, భారత క్రికెట్‌కు మాత్రం అద్భుతమైన ఆణిముత్యాలను అందిస్తూనే ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో యంగ్ టాలెంట్‌ను గుర్తించడంలో రాజస్థాన్ టీమ్ ఎప్పుడూ ముందుంటుంది. ప్రస్తుతం ఆ జట్టులో ఇద్దరు యువ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. వారే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. ఈ యంగ్ అండ్ డైనమిక్ జోడీ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచింది.

నేడు (ఏప్రిల్ 4, శనివారం) రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలపైనే ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌లో ఒక భారీ రికార్డును వేటాడబోతున్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) 500 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా వీరు రికార్డు సృష్టించబోతున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు ఢిల్లీ తరపున ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ – గౌతమ్ గంభీర్ పేరు మీద ఉంది. ఆ రికార్డును చెరిపివేసేందుకు రాజస్థాన్ కుర్రాళ్లకు కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం.

యశస్వి, వైభవ్ జోడీ ఇప్పటివరకు కేవలం 246 బంతుల్లోనే 497 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. సెహ్వాగ్, గంభీర్ జోడీ 309 బంతుల్లో 500 పరుగుల మైలురాయిని అందుకున్నారు. అంటే రాజస్థాన్ ఓపెనర్లు మరో 60 బంతుల లోపు ఈ 3 పరుగులు చేసినా కొత్త రికార్డు నెలకొల్పినట్టే. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే ఫోర్ కొడితే, అతి తక్కువ బంతుల్లో 500 పరుగుల మార్కును అందుకున్న అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీగా వీరు చరిత్రలో నిలిచిపోతారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్ చూస్తే బౌలర్లకు ఒణుకు పుట్టాల్సిందే.. ఎందుకంటే వీరిద్దరూ కలిసి 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు.

కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు 15 ఏళ్ల ప్రాయంలో వినాశకరమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు సీనియర్ పార్టనర్ యశస్వి జైస్వాల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా చాటి, రాజస్థాన్ రాయల్స్‌కు వెన్నెముకగా మారాడు. గత సీజన్ నుంచి వీరిద్దరి జోడీ కుదిరింది. అప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ పవర్‌ప్లేలో పరుగుల వరద పారిస్తోంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ వంటి దిగ్గజాలను వీరు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ఫస్ట్ ఉంటుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని ఈ టీమ్, ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. జైస్వాల్-వైభవ్ ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2008 తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ గెలవని లోటును ఈ యువ జోడీ తీరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నేడు జరిగే మ్యాచ్‌లో ఈ చారిత్రాత్మక రికార్డు నమోదవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us