AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్.. ఇకపై వేలంలో కొనే ధైర్యమే చేయరుగా..!

Indian Cricketers Retirement: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. అయితే, ఈ టోర్నీ ఎంతో మంది యువ ఆటగాళ్లకు సత్తా చాటుకునే అవకాశాలు ఇస్తున్నప్పటికీ, కొందరు సీనియర్ ఆటగాళ్ల భవితవ్యాన్ని మాత్రం ప్రశ్నార్థకంగా మార్చింది. ఫామ్ లేమి, వయసు మీద పడటంతో ముగ్గురు భారత ఆటగాళ్ల ప్రయాణం ఈ సీజన్‌తోనే ముగిసేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది మెగా వేలంలో వీరికి కనీస మద్దతు దక్కే అవకాశం లేదు.

ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్.. ఇకపై వేలంలో కొనే ధైర్యమే చేయరుగా..!
Ipl 2026 Indian Cricketers Retirement
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 3:26 PM

Share

Indian cricketers retirement: క్రికెట్ పండుగ ఐపీఎల్ లో పోటీ ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది. ఇక్కడ ప్రతిభ చూపిస్తేనే మనుగడ సాధ్యమవుతుంది. కానీ, గత కొంతకాలంగా పేలవమైన ఆటతీరు కనబరుస్తూ, తుది జట్టులో కనీస చోటు దక్కించుకోలేకపోతున్న ముగ్గురు భారత క్రికెటర్ల ఐపీఎల్ ప్రయాణం ఈ 2026 సీజన్ తర్వాత దాదాపు ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. మనీష్ పాండే: భారత మిడిలార్డర్ బ్యాటర్ మనీష్ పాండే ఐపీఎల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకుందనే చెప్పాలి. 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఇతడిని 75 లక్షల రూపాయలకు అట్టిపెట్టుకున్నప్పటికీ, తుది జట్టులో కనీసం ఆడే అవకాశం కల్పించడం లేదు. 36 ఏళ్ల ఈ వెటరన్ ఆటగాడు తన మునుపటి ఫామ్ కోల్పోవడమే ఇందుకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. వచ్చే సీజన్ నాటికి అతనికి 37 ఏళ్లు వస్తాయి. కుర్రాళ్ల రాకతో 2027 వేలంలో ఏ జట్టు కూడా ఇతని వైపు చూసే అవకాశం లేదు. ఇప్పటివరకు తన కెరీర్లో 174 మ్యాచ్‌లు ఆడిన పాండే, 29.42 సగటుతో 3942 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో అతడి అత్యధిక స్కోరు 114 పరుగులు కాగా, 1 శతకం మరియు 22 అర్ధ శతకాలు ఉన్నాయి.

2. ఇషాంత్ శర్మ: భారత జట్టు వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను ప్రస్తుత సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ 75 లక్షల రూపాయలకు రిటైన్ చేసుకుంది. కానీ, ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అతనికి మైదానంలోకి దిగే అవకాశం రాలేదు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అశోక్ శర్మ వంటి పేసర్లతో గుజరాత్ బరిలోకి దిగుతుండటంతో, 37 ఏళ్ల ఇషాంత్ సేవలు ఆ జట్టుకు ఇక అవసరం లేదని తేలిపోయింది. వచ్చే ఏడాదికి 38 ఏళ్లు దాటే ఈ సీనియర్ బౌలర్‌ను కొనుగోలు చేసేందుకు రాబోయే వేలంలో ఎవరూ ఆసక్తి చూపించరు. తన సుదీర్ఘ కెరీర్‌లో 117 మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్, కేవలం 96 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.

3. అజింక్య రహానే: పేలవమైన ఆటతీరుతో ఇప్పటికే జాతీయ జట్టుకు దూరమైన క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే, ఇప్పుడు తన ఐపీఎల్ ప్రయాణాన్ని కూడా కష్టాల్లో పడేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 1.5 కోట్ల రూపాయల భారీ ధరకు ఇతడిని అట్టిపెట్టుకుంది. 2025 సీజన్ నుండి కోల్‌కతా జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ 2026 సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన రహానే.. వరుసగా 67, 8, 8*, 41, 28, 0 పరుగులతో 30.40 సగటుతో కేవలం 152 పరుగులు మాత్రమే చేశాడు. రాబోయే వేలంలో ఈ పేలవ ప్రదర్శన ఆధారంగా అతన్ని ఏ జట్టూ తీసుకునే సాహసం చేయదు. తన కెరీర్‌లో మొత్తంగా 204 మ్యాచ్‌లు ఆడిన రహానే 30.49 సగటుతో 5184 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 105 పరుగులు కాగా, 2 శతకాలు, 34 అర్ధ శతకాలు నమోదు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్..?
ఐపీఎల్ 2026తో ఈ ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల కెరీర్ క్లోజ్..?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అక్షయ తృతీయ రోజు వాహనం కొనుగోలు చేయడం మంచిదేనా?
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
అబ్బ.. చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఖరీదైన కలర్స్‌ వద్దు.. వీటితో హెయిర్ డై చేసి రాసుకుంటే..
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ఒక్కసారి డిపాజిట్‌ చేస్తే చాలు.. ప్రతి నెలా రూ.9,250 ఆదాయం..!
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
ప్రవేశ పరీక్షలకు 2026 వేళాయే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో అనుమతి
బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
బిగ్ బాస్ వల్ల నాకు తామర వచ్చింది.. రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందే
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
రాత్రి 8.30 గంటలకు దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పన్నెండేళ్లలో 400 శాతం లాభం.. అక్షయ తృతీయ వేళ బంగారం రికార్డు
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే