AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: రూ. 1 కోటి ఇవ్వు.. లేదంటే చంపేస్తాం.. మహ్మద్ షమీకి బెదిరింపు మెయిల్

Mohammed Shami: ఐపీఎల్ 2025లో ప్రస్తుతం అందరి చూపు ప్లే ఆఫ్స్ వైపు నిలిచింది. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చింది. మరో 3 మ్యాచ్‌లు ఉండగానే ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంది. ఈ మధ్యలో హైదరాబాద్ బౌలర్ షమీకి బెదిరింపులు వచ్చాయి.

Mohammed Shami: రూ. 1 కోటి ఇవ్వు.. లేదంటే చంపేస్తాం.. మహ్మద్ షమీకి బెదిరింపు మెయిల్
Mohammed Shami Most Times Took 1st Ball Wicket
Venkata Chari
|

Updated on: May 06, 2025 | 7:51 AM

Share

Mohammed Shami: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ప్రస్తుతం భారతదేశంలో ఉత్కంఠగా సాగుతోంది. దీనిలో భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి స్టార్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. అదే లీగ్‌లో, భారత ప్రధాన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున వహిస్తున్నాడు. ఈ క్రమంలో భారత స్టార్ పేసర్ షమీకి బెదిరింపులు వచ్చాయి.

సోమవారం నాడు, ఒక గుర్తు తెలియని వ్యక్తి షమీ (Mohammed Shami) కి ఒక ఇమెయిల్ పంపాడు. అతని నుంచి రూ. 1 కోటి డిమాండ్ చేసి, ఆ మొత్తం చెల్లించకపోతే చంపేస్తానని బెదిరించాడు. షమీకి బెదిరింపు వచ్చిన తర్వాత, దాని గురించిన సమాచారం వెంటనే పోలీసు శాఖకు అందింది.

షమీ సోదరుడు ఫిర్యాదు..

ఈ సంఘటన గురించి అమ్రోహా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు సమాచారం ఇస్తూ, భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సోదరుడు హసీబ్ మాట్లాడుతూ, ఆదివారం ఈమెయిల్ ద్వారా బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని, అందులో షమీని చంపుతామని బెదిరించారని తెలిపారు. నిన్ను చంపేస్తాం అంటూ మెయిల్‌లో రాసి ఉందని షమీ సోదరుడు తెలిపాడు. ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోతుంది. అయితే, మెయిల్ అందిన వెంటనే షమీ సోదరుడు హసీబ్ పోలీసులకు సమాచారం అందించాడు. నేరస్థులు మెయిల్ ద్వారా రూ. 1 కోటి డిమాండ్ చేశారని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

కేసు నమోదు చేసిన పోలీసులు..

హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో, అమ్రోహా పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో క్రికెటర్ మహ్మద్ షమీ సోదరుడు హసీబ్ తన సోదరుడిని ఇమెయిల్ ద్వారా చంపుతామని బెదిరించాడని పోలీసులకు తెలియజేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మెయిల్ ఆదివారం మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో వచ్చింది.

మీడియా నివేదికల ప్రకారం, రాజ్‌పుత్ సింఘర్ పేరుతో మహమ్మద్ షమీకి ఒక ఇమెయిల్ పంపింది. అందులో అతని పేరు ప్రభాకర్ అని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమ్రోహా పోలీసులు సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తి బెంగళూరు నివాసి అని, అతను రూ. కోటి డిమాండ్ చేశాడని, డబ్బు చెల్లించకపోతే షమీకి హాని చేస్తానని బెదిరించాడని కూడా చెబుతున్నారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..