IPL 2025: కెరీర్ మొత్తం వివాదాలే.. ఆ రూల్స్ బ్రేక్‌తో నిషేధం కూడా.. కట్‌చేస్తే.. తొలిసారి ఐపీఎల్‌లో లక్కీ ఛాన్స్

Gujarat Titan: ఐపీఎల్ 2025 (IPL 2025) మధ్యలో, గుజరాత్ టైటాన్స్ జట్టు తన జట్టులో కీలక మార్పు చేసింది. గుజరాత్ తన జట్టులో వివాదాలతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆటగాడిని చేర్చుకుంది. ఈ ఆటగాడు నిషేధాన్ని కూడా ఎదుర్కోవడం గమనార్హం.

IPL 2025: కెరీర్ మొత్తం వివాదాలే.. ఆ రూల్స్ బ్రేక్‌తో నిషేధం కూడా.. కట్‌చేస్తే.. తొలిసారి ఐపీఎల్‌లో లక్కీ ఛాన్స్
Gujarat Titans

Updated on: May 16, 2025 | 12:26 PM

Gujarat Titan: ఐపీఎల్ 2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ జట్టు చాలా మంచి లయలో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 16 పాయింట్లు సాధించింది. గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి అతిపెద్ద పోటీదారులలో ఒకటిగా నిలిచింది. ఈ కారణంగా జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ కోసం తన సన్నాహాలను ముమ్మరం చేసింది. నిజానికి, ఆర్‌సీబీ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. గుజరాత్ కూడా అతని స్థానంలో ఆటగాడిని ప్రకటించింది. వివాదాలతో సుదీర్ఘ చరిత్ర ఉన్న బట్లర్ స్థానంలో గుజరాత్ ఒక ఆటగాడిని ఎంపిక చేయడం గమనార్హం.

మొత్తం జట్టు ప్రాణాలను ప్రమాదంలో పడేసిన వ్యక్తి గుజరాత్‌‌లోకి ఎంట్రీ..

గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్ స్థానంలో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్‌ను చేర్చుకున్నట్లు ప్రకటించింది. కుసల్ మెండిస్ మే 26న గుజరాత్ జట్టులో చేరనున్నాడు. ఈ కారణంగా అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి, PSL 2025లో, అతను క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్నాడు. కానీ, ఐపీఎల్ లాగానే, పీఎస్‌ఎల్ సస్పెన్షన్ తర్వాత, అతను తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పీఎస్‌ఎల్‌ను వదిలి ఐపీఎల్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతను తొలిసారి ఐపీఎల్‌లో భాగం కాబోతున్నాడు.

కుశాల్ మెండిస్‌కు వివాదాలతో సుదీర్ఘ చరిత్ర ఉంది. 2021 సంవత్సరంలో, అతను మొత్తం జట్టు ప్రాణాలను ప్రమాదంలో పడేశాడు. నిజానికి, అప్పుడు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. కరోనా కారణంగా జట్టు బయో-బబుల్‌లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో, కుశాల్ మెండిస్, ఇద్దరు తోటి ఆటగాళ్లతో కలిసి, బయో-బబుల్‌ను బ్రేక్ చేసి హోటల్ నుంచి బయటకు వెళ్లాడు. అతను డర్హామ్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ఆ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు ఆటగాళ్లపై కీలక చర్యలు తీసుకుని అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఒక సంవత్సరం పాటు నిషేధించింది.

ఇవి కూడా చదవండి

హిట్ అండ్ రన్ కేసులో కూడా..

2020 సంవత్సరంలో కూడా కుశాల్ మెండిస్ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చాడు. ఆ సమయంలో అతను సైకిల్ పై వెళ్తున్న 64 ఏళ్ల వ్యక్తిని తన కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో, వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసులో ఆటగాడిని అరెస్టు చేశారు. తన కెరీర్ గురించి మాట్లాడితే, మెండిస్ శ్రీలంక తరపున 71 టెస్టుల్లో 4668 పరుగులు, 143 వన్డేల్లో 4429 పరుగులు చేశాడు. అతను 76 టీ20ల్లో 1920 పరుగులు చేశాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..