IPL 2022: ఆర్సీబీకి తప్పని నిరీక్షణ.. 15 ఏళ్లుగా టైటిల్ కోసం సాగుతోన్న పోరాటం..
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. రాజస్థాన్తో జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది.
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. రాజస్థాన్తో జరిగిన క్వాలిఫయర్ 2లో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. అయితే ఆర్సీబీ గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. దీంతో కోహ్లీ నిరీక్షణ తప్పలేదు. ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ కోరిక ఇంకా సజీవంగానే ఉంది. వచ్చే ఏడాది మరోసారి బెంగళూరు కప్ కోసం ప్రయత్నం చేయనుంది. అయితే RCB ప్లేఆఫ్కు వెళ్లడం ఇది వరుసగా మూడవ సంవత్సరం. ప్లేఆఫ్కు చేరుకోవడంలో అదృష్టం పూర్తి సహకారం అందించింది. కానీ విరాట్ కోహ్లి దురదృష్టం జట్టు విధిని శాసించినట్లు కనిపిస్తోంది. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కేవలం రెండడుగుల దూరంలో టైటిల్ను చేజార్చుకుంది.
RCB గత రెండు సీజన్లలో అంటే 2020, 2021 సంవత్సరాల్లో ప్లేఆఫ్లకు చేరుకుంది. టైటిల్కు దగ్గరగా విరాట్ కోహ్లీ ఆకాంక్షలు చెల్లాచెదురు కావడం ఈసారి ఎవరూ ఊహించలేదు. తొలిసారి 2011లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ టైటిల్ను కోల్పోయింది. ఈ జట్టు క్వాలిఫయర్ టూలో ముంబై ఇండియన్స్ను ఓడించి ఫైనల్కు టికెట్ బుక్ చేసుకుంది. అయితే ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై గెలిచింది. బంగళూరు 2016 లోనూ ఫైనల్కు వెళ్లింది. కానీ ఫైనల్ సన్రైజర్స్ టైటిల్ ఎగురేసుకుపోయింది.